రాజధాని ప్రాంతంలో తెలంగాణ మద్యం విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను తుళ్లూరు పోలీసులు అరెస్ట్ చేశారు. తుళ్లూరు మండలం అనంతవరానికి చెందిన ఆలపాటి నరసింహరావు, ఆయన కుమారుడు నాగేశ్వరరావు కారులో 330 మద్యం సీసాలను తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ఈ కేసులో మరో వ్యక్తి పరారీలో ఉన్నారని.. అతన్ని త్వరలోనే పట్టుకుంటామని సీఐ దుర్గాప్రసాద్ చెప్పారు. గతంలోనూ వీరు మద్యం విక్రయించిననట్లు కేసులున్నాయని సీఐ తెలిపారు.
ఇదీ చదవండి: