ETV Bharat / state

శ్రీశైలం జలాశయానికి పర్యటక శోభ... పెరిగిన సందర్శకుల తాకిడి - Srisailam Reservoir latest news

వారాంతం కావటం వల్ల శ్రీశైలం జలాశయం పర్యటక శోభ సంతరించుకుంది. భారీ ఎత్తున సందర్శకులు తరలి వస్తున్నారు. శ్రీశైలం పరిసరాలు రద్దీగా మారాయి. జలాశయం వద్ద సెల్ఫీలు తీసుకుంటూ సందర్శకులు సందడి చేస్తున్నారు.

శ్రీశైలం జలాశయానికి పర్యటక శోభ
శ్రీశైలం జలాశయానికి పర్యటక శోభ
author img

By

Published : Oct 3, 2020, 4:03 PM IST

శ్రీశైలం జలాశయం సందర్శకుల తాకిడితో పర్యటక శోభ సంతరించుకుంది. పర్యటకులు భారీ ఎత్తున తరలి వస్తున్నారు. శ్రీశైలం పరిసరాలు రద్దీగా మారాయి. వారాంతం కావటం వల్ల... వివిధ ప్రాంతాల నుంచి జనం భారీగా తరలివస్తున్నారు. సున్నిపెంట నుంచి శ్రీశైలం జలాశయం వరకు భారీగా వాహనాలు నిలిచిపోయాయి.

జలాశయం గేట్ల ద్వారా నీరు విడుదలవుతున్న సుందర దృశ్యాలను తిలకించేందుకు పర్యటకులు బారులు తీరారు. శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్లను దర్శించుకుని భక్తులు తిరుగు ప్రయాణం అవుతున్నారు. జలాశయం వద్ద సెల్ఫీలు తీసుకుంటూ సందడి చేస్తున్నారు.

శ్రీశైలం జలాశయం సందర్శకుల తాకిడితో పర్యటక శోభ సంతరించుకుంది. పర్యటకులు భారీ ఎత్తున తరలి వస్తున్నారు. శ్రీశైలం పరిసరాలు రద్దీగా మారాయి. వారాంతం కావటం వల్ల... వివిధ ప్రాంతాల నుంచి జనం భారీగా తరలివస్తున్నారు. సున్నిపెంట నుంచి శ్రీశైలం జలాశయం వరకు భారీగా వాహనాలు నిలిచిపోయాయి.

జలాశయం గేట్ల ద్వారా నీరు విడుదలవుతున్న సుందర దృశ్యాలను తిలకించేందుకు పర్యటకులు బారులు తీరారు. శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్లను దర్శించుకుని భక్తులు తిరుగు ప్రయాణం అవుతున్నారు. జలాశయం వద్ద సెల్ఫీలు తీసుకుంటూ సందడి చేస్తున్నారు.

ఇదీ చదవండి:

శ్రీకాకుళం, తిరుపతిలలో శిల్పారామాల నిర్మాణానికి నిధులు జారీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.