ETV Bharat / state

గ్యాంగ్​వార్​ని తలపించే ఘటన... అప్రమత్తమైన పోలీసులు

విజయవాడ గ్యాంగ్​వార్​ని తలపించేలా ఉన్న... గుంటూరు పిచ్చుకలగుంట మైదానంలో విద్యార్థుల ఘర్షణపై పోలీసులు అప్రమత్తమయ్యారు. విద్యార్థుల మధ్య వివాదాన్ని పోలీసులు సీరియస్​గా తీసుకొని... వారందరిని అదుపులోకి తీసుకున్నారు.

author img

By

Published : Jun 9, 2020, 11:55 AM IST

Students clash at Pichukulagunta ground in guntur district
Students clash at Pichukulagunta ground in guntur district

గుంటూరు పిచ్చుకలగుంట మైదానంలో యువకుల బాహాబాహీకి సంబంధించి 12 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. గుంటూరు శివారు ఇంజనీరింగ్‌ కళాశాలకు చెందిన విద్యార్థులు ఓ ఫోన్‌ సందేశం విషయమై ఆదివారం రాత్రి ఘర్షణకు దిగారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు వెళ్లి సర్దిచెప్పేందుకు ప్రయత్నించినా.. ఘర్షణ పడుతున్నవారెవరూ మాట వినకపోవటంతో వారందర్నీ అదుపులోకి తీసుకున్నారు. ఇటువంటి గొడవలకు ఎవరు పాల్పడినా కఠిన చర్యలు ఉంటాయని పోలీసులు హెచ్చరించారు.

గుంటూరు పిచ్చుకలగుంట మైదానంలో యువకుల బాహాబాహీకి సంబంధించి 12 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. గుంటూరు శివారు ఇంజనీరింగ్‌ కళాశాలకు చెందిన విద్యార్థులు ఓ ఫోన్‌ సందేశం విషయమై ఆదివారం రాత్రి ఘర్షణకు దిగారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు వెళ్లి సర్దిచెప్పేందుకు ప్రయత్నించినా.. ఘర్షణ పడుతున్నవారెవరూ మాట వినకపోవటంతో వారందర్నీ అదుపులోకి తీసుకున్నారు. ఇటువంటి గొడవలకు ఎవరు పాల్పడినా కఠిన చర్యలు ఉంటాయని పోలీసులు హెచ్చరించారు.

ఇదీ చదవండి: కాపురానికి రానందుకు భార్య, మామను కిరాతకంగా చంపిన భర్త

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.