ETV Bharat / state

పేరేచర్లలో రాష్ట్రస్థాయి క్రికెట్ పోటీలు ప్రారంభం

author img

By

Published : Jan 22, 2021, 9:42 PM IST

గుంటూరు జిల్లా పేరేచర్లలో రాష్ట్రస్థాయి క్రికెట్ పోటీలు ప్రారంభమయ్యాయి. జిల్లా జాయింట్ కలెక్టర్ దినేశ్ కుమార్ పోటీలను ప్రారంభించారు.

cricket
పేరేచర్లలో రాష్ట్రస్థాయి క్రికెట్ పోటీలు ప్రారంభం

గుంటూరు జిల్లా మేడికొండూరు మండలంలోని పేరేచర్లలో గల ఏసీఏ నరేంద్రనాథ్ క్రికెట్ మైదానంలో రాష్ట్ర స్థాయి క్రికెట్ పోటీలు శుక్రవారం ప్రారంభం అయ్యాయి. నరేంద్రనాథ్ క్రికెట్ క్లబ్ ఆధ్వర్యంలో పీఎస్ వెంకటేశ్వరరావు, సత్యంబాబు గుర్తుగా ఈ పోటీలను నిర్వహిస్తున్నారు. గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టర్ దినేశ్ కుమారు టాస్ వేసి పోటీలను ప్రారంభించారు. మొదటి రోజు గుంటూరుకు చెందిన జీఆర్​సీ క్రికెట్ క్లబ్, విజయవాడకు చెందిన గో స్పోర్ట్స్ జట్ల మధ్య పోటీ జరిగింది. విజయవాడకు చెందిన జట్టు విజయం సాధించింది.

గుంటూరు జిల్లా మేడికొండూరు మండలంలోని పేరేచర్లలో గల ఏసీఏ నరేంద్రనాథ్ క్రికెట్ మైదానంలో రాష్ట్ర స్థాయి క్రికెట్ పోటీలు శుక్రవారం ప్రారంభం అయ్యాయి. నరేంద్రనాథ్ క్రికెట్ క్లబ్ ఆధ్వర్యంలో పీఎస్ వెంకటేశ్వరరావు, సత్యంబాబు గుర్తుగా ఈ పోటీలను నిర్వహిస్తున్నారు. గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టర్ దినేశ్ కుమారు టాస్ వేసి పోటీలను ప్రారంభించారు. మొదటి రోజు గుంటూరుకు చెందిన జీఆర్​సీ క్రికెట్ క్లబ్, విజయవాడకు చెందిన గో స్పోర్ట్స్ జట్ల మధ్య పోటీ జరిగింది. విజయవాడకు చెందిన జట్టు విజయం సాధించింది.

ఇదీ చదవండి: 'రాష్ట్రంలో కేంద్ర వ్యవసాయ పథకాలు సరిగా అమలు కావడం లేదు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.