ETV Bharat / state

విజయానంద్‌కు అదనపు బాధ్యతలు.. చార్జ్ తీసుకున్న మరుసటి రోజే జేసీ వికాస్ మర్మత్​ బదిలీ

Some Other IAS Transfers In AP : రాష్ట్రంలో మరికొందరు ఐఏఎస్​లకు పోస్టింగ్, బదిలీ ఉత్తర్వులు జారీ చేశారు. ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్​కు ఏపీ ట్రాన్స్​ కో సీఎండిగా అదనపు బాధ్యతలు ఇచ్చారు. మరోవైపు కర్నూలు జిల్లా జాయింట్ కలెక్టర్​గా శుక్రవారం పదవీ బాధ్యతలు చేపట్టిన వికాస్ మర్మత్ మరోసారి బదిలీ అయ్యారు.

author img

By

Published : Apr 8, 2023, 12:32 PM IST

Some Other IAS Transfers In AP
Some Other IAS Transfers In AP

Some Other IAS Transfers In AP : రాష్ట్ర ప్రభుత్వం పలువురు ఐఏఎస్‌ అధికారులను బదిలీ చేయగా.. మరికొందరికి అదనపు బాధ్యతలను అప్పగిస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. గురువారం భారీగా ఐఏఎస్‌ అధికారులను బదిలీ చేసిన సంగతి విదితమే. ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్న కె.విజయానంద్‌కు ట్రాన్స్‌కో సీఎండీగా అదనపు బాధ్యతలను అప్పగించింది. సర్వ శిక్ష అభియాన్‌ అదనపు ప్రాజెక్టు డైరెక్టర్‌గా పూర్తి అదనపు బాధ్యతలను నిర్వహిస్తున్న ఎస్‌. సురేష్‌ కుమార్‌ను బదిలీ చేసి.. ఆ స్థానంలో బి. శ్రీనివాసరావును నియమించింది.

ఐఏఎస్‌ అధికారి వెట్రిసెల్విని సాధారణ పరిపాలన శాఖలో రిపోర్టు చేయాలంటూ గురువారం ఇచ్చిన బదిలీ ఉత్తర్వులను నిలిపేసింది. ప్రసవ సెలవుపై వెళ్లిన నారపురెడ్డి మౌర్యను కర్నూలు జిల్లా జాయింట్‌ కలెక్టర్‌గా నియమించింది. నెల్లూరు మున్సిపల్‌ కమిషనర్‌గా ఉన్న హరితను తిరుపతి మున్సిపల్‌ కమిషనర్‌గా బదిలీ చేసింది. ఆ స్థానంలో వికాస్‌ మర్మత్‌ను నియమించింది. బాపట్ల జాయింట్‌ కలెక్టర్‌గా సీసీఎల్‌ఏ జాయింట్‌ సెక్రటరీ (విజిలెన్స్‌)గా వ్యవహరిస్తున్న చామకూరి శ్రీధర్‌ను నియమించింది. బాపట్ల జాయింట్‌ కలెక్టర్‌ శ్రీనివాస్‌ను ప్రకాశం జిల్లా జేసీగా నియమించింది.

బాధ్యతలు చేపట్టిన మొదటిరోజే.. మరోసారి బదిలీ: కర్నూలు జిల్లా జాయింట్ కలెక్టర్​గా శుక్రవారం పదవీ బాధ్యతలు చేపట్టిన వికాస్ మర్మత్ నేడు మరోసారి బదిలీ అయ్యారు. రాష్ట్రంలో ఐఏఎస్ బదిలీల్లో భాగంగా కర్నూలు జిల్లా జాయింట్ కలెక్టర్​గా వికాస్ మర్మత్​ను నియమించారు. ఆయన శుక్రవారం కర్నూలు జిల్లా జాయింట్ కలెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న రామసుందర్​ రెడ్డి నుంచి బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు స్వీకరించిన రోజే నెల్లూరు మున్సిపల్ కమిషనర్​గా బదిలీ చేశారు. పదవీ భాద్యతలు తీసుకున్న రోజే బదిలీ చెయ్యడం గమనార్హం. తాజాగా కర్నూలు జిల్లా జాయింట్ కలెక్టర్​గా నారపు రెడ్డి మౌర్యను నియమించారు.

54మంది ఐఏఎస్​లు బదిలీ: సార్వత్రిక ఎన్నికలకు ఇంకా ఏడాది ఉన్న తరుణంలో.. ఆంధ్రప్రదేశ్‌లో భారీగా IAS అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సీనియర్‌, జూనియర్ అధికారులందరినీ కలిపి.. 54 మందిని బదిలీ చేయడంతో పాటు.. పోస్టింగులు ఇస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈ మేరకు సీఎస్ జవహర్‌రెడ్డి.. గురువారం రాత్రి పొద్దుపోయాక.. ఉత్తర్వులు జారీ చేశారు. 8 జిల్లాలకు చెందిన కలెక్టర్లను బదిలీ చేశారు. నెల్లూరు జిల్లా కలెక్టర్‌గా హరినారాయణ్‌ను నియమించారు. విజయనగరం జిల్లా కలెక్టర్‌గా ఎస్‌.నాగలక్ష్మిని బదిలీ చేశారు.

39ఐపీఎస్​లు బదిలీ: రాష్త్రంలో 39 IPSలు బదిలీ అయ్యారు. ఈ మేరకు సీఎస్‌ జవహర్‌రెడ్డి అర్థరాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. ఏలూరు రేంజ్ డీఐజీగా జి.వి.జి. అశోక్‌కుమార్‌, గుంటూరు రేంజ్ ఐజీగా జి.పాలరాజుని... ప్రభుత్వం బదిలీ చేసింది. అదే సమయంలో దిశా ఐజీగా జి.పాలరాజుకు అదనపు బాధ్యతలు అప్పగించింది. అనంతపురం రేంజ్‌ డీఐజీగా ఆర్.ఎన్‌.అమ్మిరెడ్డి, ఎస్‌ఈబీ డీఐజీగా ఎం.రవిప్రకాశ్, ఏపీఎస్పీ డీఐజీగా బి.రాజకుమారిని.. ప్రభుత్వం నియమించింది.

ఇవీ చదవండి:

Some Other IAS Transfers In AP : రాష్ట్ర ప్రభుత్వం పలువురు ఐఏఎస్‌ అధికారులను బదిలీ చేయగా.. మరికొందరికి అదనపు బాధ్యతలను అప్పగిస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. గురువారం భారీగా ఐఏఎస్‌ అధికారులను బదిలీ చేసిన సంగతి విదితమే. ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్న కె.విజయానంద్‌కు ట్రాన్స్‌కో సీఎండీగా అదనపు బాధ్యతలను అప్పగించింది. సర్వ శిక్ష అభియాన్‌ అదనపు ప్రాజెక్టు డైరెక్టర్‌గా పూర్తి అదనపు బాధ్యతలను నిర్వహిస్తున్న ఎస్‌. సురేష్‌ కుమార్‌ను బదిలీ చేసి.. ఆ స్థానంలో బి. శ్రీనివాసరావును నియమించింది.

ఐఏఎస్‌ అధికారి వెట్రిసెల్విని సాధారణ పరిపాలన శాఖలో రిపోర్టు చేయాలంటూ గురువారం ఇచ్చిన బదిలీ ఉత్తర్వులను నిలిపేసింది. ప్రసవ సెలవుపై వెళ్లిన నారపురెడ్డి మౌర్యను కర్నూలు జిల్లా జాయింట్‌ కలెక్టర్‌గా నియమించింది. నెల్లూరు మున్సిపల్‌ కమిషనర్‌గా ఉన్న హరితను తిరుపతి మున్సిపల్‌ కమిషనర్‌గా బదిలీ చేసింది. ఆ స్థానంలో వికాస్‌ మర్మత్‌ను నియమించింది. బాపట్ల జాయింట్‌ కలెక్టర్‌గా సీసీఎల్‌ఏ జాయింట్‌ సెక్రటరీ (విజిలెన్స్‌)గా వ్యవహరిస్తున్న చామకూరి శ్రీధర్‌ను నియమించింది. బాపట్ల జాయింట్‌ కలెక్టర్‌ శ్రీనివాస్‌ను ప్రకాశం జిల్లా జేసీగా నియమించింది.

బాధ్యతలు చేపట్టిన మొదటిరోజే.. మరోసారి బదిలీ: కర్నూలు జిల్లా జాయింట్ కలెక్టర్​గా శుక్రవారం పదవీ బాధ్యతలు చేపట్టిన వికాస్ మర్మత్ నేడు మరోసారి బదిలీ అయ్యారు. రాష్ట్రంలో ఐఏఎస్ బదిలీల్లో భాగంగా కర్నూలు జిల్లా జాయింట్ కలెక్టర్​గా వికాస్ మర్మత్​ను నియమించారు. ఆయన శుక్రవారం కర్నూలు జిల్లా జాయింట్ కలెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న రామసుందర్​ రెడ్డి నుంచి బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు స్వీకరించిన రోజే నెల్లూరు మున్సిపల్ కమిషనర్​గా బదిలీ చేశారు. పదవీ భాద్యతలు తీసుకున్న రోజే బదిలీ చెయ్యడం గమనార్హం. తాజాగా కర్నూలు జిల్లా జాయింట్ కలెక్టర్​గా నారపు రెడ్డి మౌర్యను నియమించారు.

54మంది ఐఏఎస్​లు బదిలీ: సార్వత్రిక ఎన్నికలకు ఇంకా ఏడాది ఉన్న తరుణంలో.. ఆంధ్రప్రదేశ్‌లో భారీగా IAS అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సీనియర్‌, జూనియర్ అధికారులందరినీ కలిపి.. 54 మందిని బదిలీ చేయడంతో పాటు.. పోస్టింగులు ఇస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈ మేరకు సీఎస్ జవహర్‌రెడ్డి.. గురువారం రాత్రి పొద్దుపోయాక.. ఉత్తర్వులు జారీ చేశారు. 8 జిల్లాలకు చెందిన కలెక్టర్లను బదిలీ చేశారు. నెల్లూరు జిల్లా కలెక్టర్‌గా హరినారాయణ్‌ను నియమించారు. విజయనగరం జిల్లా కలెక్టర్‌గా ఎస్‌.నాగలక్ష్మిని బదిలీ చేశారు.

39ఐపీఎస్​లు బదిలీ: రాష్త్రంలో 39 IPSలు బదిలీ అయ్యారు. ఈ మేరకు సీఎస్‌ జవహర్‌రెడ్డి అర్థరాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. ఏలూరు రేంజ్ డీఐజీగా జి.వి.జి. అశోక్‌కుమార్‌, గుంటూరు రేంజ్ ఐజీగా జి.పాలరాజుని... ప్రభుత్వం బదిలీ చేసింది. అదే సమయంలో దిశా ఐజీగా జి.పాలరాజుకు అదనపు బాధ్యతలు అప్పగించింది. అనంతపురం రేంజ్‌ డీఐజీగా ఆర్.ఎన్‌.అమ్మిరెడ్డి, ఎస్‌ఈబీ డీఐజీగా ఎం.రవిప్రకాశ్, ఏపీఎస్పీ డీఐజీగా బి.రాజకుమారిని.. ప్రభుత్వం నియమించింది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.