ETV Bharat / state

Public Opinion on ACCMC: ఏసీసీఎంసీని వ్యతిరేకిస్తూ.. గ్రామసభల్లో ఏకగ్రీవ తీర్మానం

author img

By

Published : Jan 7, 2022, 12:17 PM IST

Updated : Jan 7, 2022, 8:50 PM IST

Public Opinion on ACCMC: అమరావతి మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఏర్పాటును రాజధాని గ్రామాలు ముక్తకంఠంతో వ్యతిరేకిస్తున్నాయి. సీఐర్​డీఏ చట్టం ప్రకారం 29 గ్రామాలన్నింటినీ కలిపే ఉంచాలని కోరాయి. వెలగపూడి, మందడం, మల్కాపురంలో ఏర్పాటు చేసిన గ్రామసభల్లో కార్పొరేషన్ ఏర్పాటును వ్యతిరేకిస్తూ ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. అమరావతి భూములను దోచుకునేందుకే ప్రభుత్వం కొత్త ఎత్తుగడ వేసిందని గ్రామస్థులు మండిపడ్డారు.

ఏసీసీఎంసీపై మూడో రోజు కొనసాగుతున్న ప్రజాభిప్రాయ సేకరణ
ఏసీసీఎంసీపై మూడో రోజు కొనసాగుతున్న ప్రజాభిప్రాయ సేకరణ
అమరావతి కార్పొరేషన్‌ను వ్యతిరేకించిన రాజధాని ప్రజలు

Public Opinion on ACCMC: అమరావతి గ్రామాల్లో వరుసగా మూడోరోజూ అదే పరిస్థితి. కార్పొరేషన్‌ ఏర్పాటుపై ప్రభుత్వ నిర్ణయాన్ని మరో మూడు గ్రామాలు ముక్తకంఠంతో వ్యతిరేకించాయి. 19 గ్రామాలతో ఏర్పాటు చేయనున్న అమరావతి మున్సిపల్ కార్పొరేషన్‌ను వ్యతిరేకిస్తూ వెలగపూడి, మల్కాపురం, మందడంలో గ్రామసభలు ఏకగ్రీవంగా తీర్మానం చేశాయి. సీఐర్​డీఏ చట్టం ప్రకారం 29 గ్రామాలతో కాకుండా 19 గ్రామాలతో కార్పొరేషన్ ఏర్పాటు చేయడం ఏంటని రైతులు నిలదీశారు. రెండేళ్లుగా ఆందోళన చేస్తుంటే పట్టించుకోని ప్రభుత్వం... ఇప్పుడు కొత్తగా కార్పొరేషన్ ఏర్పాటు చేయడం.. అమరావతి ప్రాంత వాసులను మరోసారి మోసం చేయడమేనన్నారు. రాజధాని ఏర్పాటు కోసం భూములిచ్చామని.. ఇప్పుడు విభజించడమేంటని వెలగపూడి ప్రజలు నిలదీశారు. మంగళగిరి-తాడేపల్లి కార్పొరేషన్ ఏర్పాటు అక్కడి రాజధాని గ్రామ ప్రజల ఆమోదంతోనే జరిగిందని అధికారులు తెలపగా.. తీర్మానం కాపీలు చూపాలని ప్రజలు కోరారు.

29 గ్రామాలను కలిపే ఉంచాలి

రాజధాని ప్రాంతంలో రెండేళ్లకుపైగా ఎలాంటి అభివృద్ధి చేపట్టని ప్రభుత్వం.. ఇప్పుడు కార్పొరేషన్ ఏర్పాటు చేయడం చూస్తే.. భూముల తాకట్టు కోసమేనన్న సందేహం కలుగుతోందని రైతులు మండిపడ్డారు. ప్రభుత్వం విభజించు, పాలించు విధానం అమలు చేస్తోందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 29 గ్రామాలను కలిపే ఉంచాలని డిమాండ్ చేశారు.

29 గ్రామాలతో కార్పొరేషన్​కు తీర్మానం

వెలగపూడి, మల్కాపురం, మందడంలో ప్రజలంతా మూకుమ్మడిగా ఒకేమాట మీద నిలబడ్డారు. ఓటింగ్ సందర్భంగా ప్రభుత్వ ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ అందరూ చేతులెత్తారు. సీఐర్​డీఏ(CRDA Act) చట్టంలోని 29 గ్రామాలతో కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని తీర్మానించారు.

9 గ్రామసభల్లోనూ వ్యతిరేక తీర్మానాలే

అమరావతి కార్పొరేషన్‌పై ఇప్పటివరకూ జరిగిన 9 గ్రామసభల్లోనూ వ్యతిరేక తీర్మానాలే నమోదయ్యాయి. శని, ఆదివారాల్లో సెలవులు కాబట్టి గ్రామసభలకు విరామం ఇచ్చారు. మళ్లీ సోమవారం నుంచి గ్రామసభలు నిర్వహించనున్నారు.

రెండో రోజూ ఆదే వ్యతిరేకత

2nd Day Public Opinion on ACCMC: అమరావతి క్యాపిటల్‌ సిటీ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఏర్పాటుపై రెండో రోజూ రాజధాని గ్రామాల్లో అధికారులు ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించారు. తొలుత తుళ్లూరు మండలంలోని లింగాయపాలెం, తర్వాత మంగళగిరి మండలం కృష్ణాయపాలెంలో గ్రామ సభలు నిర్వహించగా.. 19 గ్రామాలతో కూడీన కార్పొరేషన్‌ ఏర్పాటును గ్రామస్థులు వ్యతిరేకించారు.

29 గ్రామాల సంపూర్ణ రాజధానికే తాము అనుకూలమంటూ ప్రజాభిప్రాయ సేకరణకు వచ్చిన అధికారులకు స్పష్టం చేశారు. రాజధాని మాస్టర్‌ప్లాన్‌ ప్రకారం ఆ గ్రామాలను అభివృద్ధి చేసిన తర్వాత.. అన్నింటినీ కలిపే కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలని.. సభకు హాజరైన వారందరూ తేల్చిచెప్పారు.

ఇదీ చదవండి: Amaravati Capital City: '19 కాదు.. 29 గ్రామాలతో అమరావతి కార్పొరేషన్​ ఏర్పాటు చేయాలి'

అమరావతి కార్పొరేషన్‌ను వ్యతిరేకించిన రాజధాని ప్రజలు

Public Opinion on ACCMC: అమరావతి గ్రామాల్లో వరుసగా మూడోరోజూ అదే పరిస్థితి. కార్పొరేషన్‌ ఏర్పాటుపై ప్రభుత్వ నిర్ణయాన్ని మరో మూడు గ్రామాలు ముక్తకంఠంతో వ్యతిరేకించాయి. 19 గ్రామాలతో ఏర్పాటు చేయనున్న అమరావతి మున్సిపల్ కార్పొరేషన్‌ను వ్యతిరేకిస్తూ వెలగపూడి, మల్కాపురం, మందడంలో గ్రామసభలు ఏకగ్రీవంగా తీర్మానం చేశాయి. సీఐర్​డీఏ చట్టం ప్రకారం 29 గ్రామాలతో కాకుండా 19 గ్రామాలతో కార్పొరేషన్ ఏర్పాటు చేయడం ఏంటని రైతులు నిలదీశారు. రెండేళ్లుగా ఆందోళన చేస్తుంటే పట్టించుకోని ప్రభుత్వం... ఇప్పుడు కొత్తగా కార్పొరేషన్ ఏర్పాటు చేయడం.. అమరావతి ప్రాంత వాసులను మరోసారి మోసం చేయడమేనన్నారు. రాజధాని ఏర్పాటు కోసం భూములిచ్చామని.. ఇప్పుడు విభజించడమేంటని వెలగపూడి ప్రజలు నిలదీశారు. మంగళగిరి-తాడేపల్లి కార్పొరేషన్ ఏర్పాటు అక్కడి రాజధాని గ్రామ ప్రజల ఆమోదంతోనే జరిగిందని అధికారులు తెలపగా.. తీర్మానం కాపీలు చూపాలని ప్రజలు కోరారు.

29 గ్రామాలను కలిపే ఉంచాలి

రాజధాని ప్రాంతంలో రెండేళ్లకుపైగా ఎలాంటి అభివృద్ధి చేపట్టని ప్రభుత్వం.. ఇప్పుడు కార్పొరేషన్ ఏర్పాటు చేయడం చూస్తే.. భూముల తాకట్టు కోసమేనన్న సందేహం కలుగుతోందని రైతులు మండిపడ్డారు. ప్రభుత్వం విభజించు, పాలించు విధానం అమలు చేస్తోందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 29 గ్రామాలను కలిపే ఉంచాలని డిమాండ్ చేశారు.

29 గ్రామాలతో కార్పొరేషన్​కు తీర్మానం

వెలగపూడి, మల్కాపురం, మందడంలో ప్రజలంతా మూకుమ్మడిగా ఒకేమాట మీద నిలబడ్డారు. ఓటింగ్ సందర్భంగా ప్రభుత్వ ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ అందరూ చేతులెత్తారు. సీఐర్​డీఏ(CRDA Act) చట్టంలోని 29 గ్రామాలతో కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని తీర్మానించారు.

9 గ్రామసభల్లోనూ వ్యతిరేక తీర్మానాలే

అమరావతి కార్పొరేషన్‌పై ఇప్పటివరకూ జరిగిన 9 గ్రామసభల్లోనూ వ్యతిరేక తీర్మానాలే నమోదయ్యాయి. శని, ఆదివారాల్లో సెలవులు కాబట్టి గ్రామసభలకు విరామం ఇచ్చారు. మళ్లీ సోమవారం నుంచి గ్రామసభలు నిర్వహించనున్నారు.

రెండో రోజూ ఆదే వ్యతిరేకత

2nd Day Public Opinion on ACCMC: అమరావతి క్యాపిటల్‌ సిటీ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఏర్పాటుపై రెండో రోజూ రాజధాని గ్రామాల్లో అధికారులు ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించారు. తొలుత తుళ్లూరు మండలంలోని లింగాయపాలెం, తర్వాత మంగళగిరి మండలం కృష్ణాయపాలెంలో గ్రామ సభలు నిర్వహించగా.. 19 గ్రామాలతో కూడీన కార్పొరేషన్‌ ఏర్పాటును గ్రామస్థులు వ్యతిరేకించారు.

29 గ్రామాల సంపూర్ణ రాజధానికే తాము అనుకూలమంటూ ప్రజాభిప్రాయ సేకరణకు వచ్చిన అధికారులకు స్పష్టం చేశారు. రాజధాని మాస్టర్‌ప్లాన్‌ ప్రకారం ఆ గ్రామాలను అభివృద్ధి చేసిన తర్వాత.. అన్నింటినీ కలిపే కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలని.. సభకు హాజరైన వారందరూ తేల్చిచెప్పారు.

ఇదీ చదవండి: Amaravati Capital City: '19 కాదు.. 29 గ్రామాలతో అమరావతి కార్పొరేషన్​ ఏర్పాటు చేయాలి'

Last Updated : Jan 7, 2022, 8:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.