గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం కుంచనపల్లి వద్ద ద్విచక్రవాహనాన్ని.. లారీ ఢీ కొట్టింది. ఘటనలో మంగళగిరి బాప్టిస్టుపేటకు చెందిన గడ్డం మల్లేశ్వరరావు మృతి చెందగా ఆయన కుమారుడు తీవ్రంగా గాయపడ్డారు. తాడేపల్లిలోని ఓ సూపర్ మార్కెట్లో సరుకులు తీసుకొని వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
రెండు నెలల వ్యవధిలో..
డిసెంబర్లో మల్లేశ్వరరావు తండ్రి రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. రెండు నెలల వ్యవధిలో ఒకే ఇంటిలో తండ్రి, కుమారుడు మృతి చెందడంతో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.
ఇదీ చదవండి