ETV Bharat / state

కుమార్తెను కాలేజీ నుంచి ఇంటికి తీసుకొస్తుండగా తల్లి మృతి

ప్రైవేట్ కాలేజీలో చదువుతున్న కుమార్తెను సెలవు రోజున ఇంటికి తీసుకువస్తుండగా ప్రమాదం జరిగి తల్లి మృతి చెందగా.. కుమార్తె తీవ్ర గాయాలయ్యాయి. వీరికి తోడుగా వచ్చిన ఓ వ్యక్తి మృతి చెందాడు.

author img

By

Published : Jul 9, 2019, 9:21 AM IST

ఘటనాస్థలం

గుంటూరు జిల్లా నరసరావుపేట మండలంలోని పమిడిమర్రు గ్రామానికి చెందిన మురికిపూడి ఏసమ్మ.. గుంటూరులోని ప్రైవేట్ కాలేజీలో విద్యనభ్యసిస్తోన్న తన కుమార్తె పెరమ్మను తీసుకొచ్చేందుకు నగరానికి వెళ్లింది. కుమారుడుకి వృత్తి రీత్యా కుదరక అతని స్నేహితుడు బాబునాయక్​ను తీసుకుని ద్విచక్రవాహనంపై గుంటూరు వెళ్లారు. కొంతసేపటి తరువాత పెరమ్మను వెంట తీసుకుని వీరు గ్రామానికి బయలుదేరారు. మండలంలోని జొన్నలగడ్డ చేరుకునే సమయానికి ఆటోను తప్పించే క్రమంలో ఎదురుగా నరసరావుపేట నుంచి గుంటూరు వెళ్తున్న ఆర్టీసీ బస్సును ద్విచక్రవాహనం ఢీకొట్టింది. ఘటనలో తల్లి ఏసమ్మ అక్కడికక్కడే మృతి చెందగా... బాబునాయక్, పెరమ్మలకు తీవ్రగాయాలయ్యాయి. వీరిని ప్రభుత్వ వైద్యశాలకు తరలిస్తుండగా బాబునాయక్ మార్గమధ్యలో మృతి చెందారు. పెరమ్మను స్థానిక ప్రైవేట్ వైద్యశాలకు తరలించారు.

ప్రమాదం తల్లిని మింగేసింది.. కుమార్తెను గాయపరిచింది

మృతుల్లోని బాబునాయక్ మాచర్ల మండలంలోని ఉప్పలపాడు గ్రామవాసి అని ఎసమ్మ కుమారుడు తెలిపాడు. విషయం తెలుసుకున్న రూరల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

గుంటూరు జిల్లా నరసరావుపేట మండలంలోని పమిడిమర్రు గ్రామానికి చెందిన మురికిపూడి ఏసమ్మ.. గుంటూరులోని ప్రైవేట్ కాలేజీలో విద్యనభ్యసిస్తోన్న తన కుమార్తె పెరమ్మను తీసుకొచ్చేందుకు నగరానికి వెళ్లింది. కుమారుడుకి వృత్తి రీత్యా కుదరక అతని స్నేహితుడు బాబునాయక్​ను తీసుకుని ద్విచక్రవాహనంపై గుంటూరు వెళ్లారు. కొంతసేపటి తరువాత పెరమ్మను వెంట తీసుకుని వీరు గ్రామానికి బయలుదేరారు. మండలంలోని జొన్నలగడ్డ చేరుకునే సమయానికి ఆటోను తప్పించే క్రమంలో ఎదురుగా నరసరావుపేట నుంచి గుంటూరు వెళ్తున్న ఆర్టీసీ బస్సును ద్విచక్రవాహనం ఢీకొట్టింది. ఘటనలో తల్లి ఏసమ్మ అక్కడికక్కడే మృతి చెందగా... బాబునాయక్, పెరమ్మలకు తీవ్రగాయాలయ్యాయి. వీరిని ప్రభుత్వ వైద్యశాలకు తరలిస్తుండగా బాబునాయక్ మార్గమధ్యలో మృతి చెందారు. పెరమ్మను స్థానిక ప్రైవేట్ వైద్యశాలకు తరలించారు.

ప్రమాదం తల్లిని మింగేసింది.. కుమార్తెను గాయపరిచింది

మృతుల్లోని బాబునాయక్ మాచర్ల మండలంలోని ఉప్పలపాడు గ్రామవాసి అని ఎసమ్మ కుమారుడు తెలిపాడు. విషయం తెలుసుకున్న రూరల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Intro:Ap_Nlr_02_07_Agni_Gundam_Minister_Kiran_Av_AP10064

నెల్లూరు మూలపేటలో వెలసివున్న శ్రీ ధర్మరాజ స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో ముఖ్య ఘట్టమైన అగ్నిగుండ కార్యక్రమం వేడుకగా జరిగింది. ఈ మహోత్సవాన్ని తిలకించేందుకు నగరం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పాల్గొని పూజలు నిర్వహించారు. సంప్రదాయబద్ధంగా అగ్ని గుండానికి పూజలు నిర్వహించిన అనంతరం పలువురు భక్తులు నిప్పులపై నడుస్తూ తమ భక్తిని చాటుకున్నారు. ఈ సందర్భంగా కృష్ణుడు, ధర్మరాజు స్వామిలను ప్రత్యేకంగా అలంకరించి నగరోత్సవం నిర్వహించారు.


Body:కిరణ్ ఈటీవీ భారత్


Conclusion:9394450291

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.