ETV Bharat / state

'కనీస వేతనాన్ని రూ. 21 వేలు చేయాలి'

కనీస వేతనాన్ని 18 వేల నుంచి 21 వేల రూపాయలకు పెంచడంతో పాటూ తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ఒప్పంద ఉద్యోగ కార్మికులు నరసరావుపేట మున్సిపల్ కార్యాలయం ఎదుట ఆందోళన చేశారు. వీరికి సీఐటీయు నాయకులు మద్దతు ప్రకటించారు.

author img

By

Published : Feb 27, 2020, 10:00 PM IST

PROTEST AT NARASARAOPETA MUNCIPAL OFFICE
'కనీస వేతనాన్ని 18వేల నుంచి 21 వేలకు పెంచాలి'
'కనీస వేతనాన్ని 18వేల నుంచి 21 వేలకు పెంచాలి'

గుంటూరు జిల్లా నరసరావుపేట మున్సిపల్ కార్యాలయం ఎదుట సీఐటీయు ఆధ్వర్యంలో ఒప్పంద ఉద్యోగ కార్మికులు ఆందోళన చేశారు. రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ ఒప్పంద ఉద్యోగులకు చేసిన వాగ్దానాలను అమలు చేయడంలో విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి జగన్, కార్మిక శాఖ మంత్రులు తమను కనీసం మనుషులుగా గుర్తించడం లేదని, గడిచిన రెండు నెలల నుంచి వేతనాలు సరిగా ఇవ్వడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై అధికారులను ఫిర్యాదు చేస్తే వారి నుంచి సరైన సమాధానం రావడం లేదని వాపోయారు. ఉద్యోగుల కనీస వేతనాన్ని 18 వేల నుంచి 21 వేల రూపాయలకు పెంచాలని డిమాండ్ చేశారు.

ఇదీచదవండి.

'బాబు పర్యటన అడ్డుకుంటామన్న మంత్రులను గవర్నర్​ బర్తరఫ్​ చేయాలి'

'కనీస వేతనాన్ని 18వేల నుంచి 21 వేలకు పెంచాలి'

గుంటూరు జిల్లా నరసరావుపేట మున్సిపల్ కార్యాలయం ఎదుట సీఐటీయు ఆధ్వర్యంలో ఒప్పంద ఉద్యోగ కార్మికులు ఆందోళన చేశారు. రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ ఒప్పంద ఉద్యోగులకు చేసిన వాగ్దానాలను అమలు చేయడంలో విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి జగన్, కార్మిక శాఖ మంత్రులు తమను కనీసం మనుషులుగా గుర్తించడం లేదని, గడిచిన రెండు నెలల నుంచి వేతనాలు సరిగా ఇవ్వడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై అధికారులను ఫిర్యాదు చేస్తే వారి నుంచి సరైన సమాధానం రావడం లేదని వాపోయారు. ఉద్యోగుల కనీస వేతనాన్ని 18 వేల నుంచి 21 వేల రూపాయలకు పెంచాలని డిమాండ్ చేశారు.

ఇదీచదవండి.

'బాబు పర్యటన అడ్డుకుంటామన్న మంత్రులను గవర్నర్​ బర్తరఫ్​ చేయాలి'

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.