గ్రామ రెవెన్యూ అధికారిపై చర్యలు తీసుకోవాలంటూ గుంటూరు జిల్లా మేడికొండూరు తహసీల్దార్కు సిరిపురం ప్రజలు వినతిపత్రం అందించారు. ఇళ్ల స్థలాల వ్యవహారంలో గ్రామ రెవెన్యూ అధికారి అక్రమాలకు పాల్పడుతున్నారని.. గ్రామస్థులు ఆరోపించారు. లంచం డిమాండ్ చేస్తూ.. అర్హుల పేరు తొలగించాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు తెలియకుండా అనర్హుల పేర్లను జాబితాలో పొందుపర్చారని తహసీల్దార్ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే గ్రామ రెవెన్యూ అధికారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి. జోరందుకున్న ఆటోమొబైల్ అమ్మకాలు