ETV Bharat / state

తెనాలిలో 2 వారాలుగా అంత్యక్రియలకు నోచుకోని మృతదేహం

author img

By

Published : Aug 13, 2020, 12:51 PM IST

తెనాలిలో ఓ మృతదేహం 2 వారాలుగా అంత్యక్రియలకు నోచుకోలేదు. తెనాలి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ జులై 30న ఓ వృద్ధుడు మరణించాడు. బంధువులు ఎవరూ రాకపోవడంతో.. ఇవాళ అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు మున్సిపల్ అధికారులు తెలిపారు.

no cremation for corona dead
no cremation for corona dead

గుంటూరు జిల్లా తెనాలి ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనాతో మృతి చెందిన వృద్ధుడి మృతదేహం 2 వారాలుగా అంత్యక్రియలకు నోచుకోలేదు. కృష్ణాజిల్లా పెనమలూరు మండలం తాడిగడపకు చెందిన వృద్ధుడు తెనాలి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ జులై 30వ తేదిన మరణించారు. ఆయనకు పిల్లలు కూడా లేకపోవడంతో... బంధువులెవరూ మృతదేహం తీసుకెళ్లేందుకు రాలేదు. దీంతో రెండు వారాలుగా మృతదేహం తెనాలి ఆసుపత్రి మార్చురీలోనే ఉంది. ఆసుపత్రి వర్గాలు ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వడంతో... ఇవాళ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు మున్సిపల్ అధికారులు తెలిపారు.

గుంటూరు జిల్లా తెనాలి ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనాతో మృతి చెందిన వృద్ధుడి మృతదేహం 2 వారాలుగా అంత్యక్రియలకు నోచుకోలేదు. కృష్ణాజిల్లా పెనమలూరు మండలం తాడిగడపకు చెందిన వృద్ధుడు తెనాలి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ జులై 30వ తేదిన మరణించారు. ఆయనకు పిల్లలు కూడా లేకపోవడంతో... బంధువులెవరూ మృతదేహం తీసుకెళ్లేందుకు రాలేదు. దీంతో రెండు వారాలుగా మృతదేహం తెనాలి ఆసుపత్రి మార్చురీలోనే ఉంది. ఆసుపత్రి వర్గాలు ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వడంతో... ఇవాళ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు మున్సిపల్ అధికారులు తెలిపారు.

ఇదీ చదవండి: త్వరలో అందుబాటులోకి... కొవిడ్‌ నిర్ధరణకు కొత్త యంత్రం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.