ETV Bharat / state

'భూముల సర్వే సక్రమంగా నిర్వహిస్తే.. సివిల్ తగాదాలు ఉండవు' - జాతీయ సర్వే దినోత్సవంపై అజయ్ కల్లం కామెంట్స్

భూముల సర్వే సక్రమంగా నిర్వహిస్తే సివిల్ తగాదాలకు ఆస్కారం ఉండదని ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారు అజేయ కల్లం అన్నారు. ప్రస్తుతం ప్రతి గ్రామానికి సర్వేయర్ ఉండటంతో భవిష్యత్​లో భూ తగాదాలకు అడ్డుకట్ట వేయవచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు.

http://10.10.50.85:6060/reg-lowres/10-April-2021/ap_gnt_03_10_national_survey_day_vis_3053245_1004digital_1618054562_596.mp4
http://10.10.50.85:6060/reg-lowres/10-April-2021/ap_gnt_03_10_national_survey_day_vis_3053245_1004digital_1618054562_596.mp4
author img

By

Published : Apr 10, 2021, 7:42 PM IST

జాతీయ సర్వే దినోత్సవం సందర్భంగా గుంటూరులోని వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో కార్యక్రమం నిర్వహించారు. సర్వేశాఖలో పనిచేస్తున్న ఉద్యోగులు, గ్రామ సర్వేయర్లు ఈ సమావేశానికి హాజరయ్యారు. విదేశాల్లో సివిల్ తగాదాల్లో భూములకు సంబంధించినవి 3శాతం లోపే ఉంటాయని.. మన వద్ద పరిస్థితి అందుకు భిన్నంగా ఉందని కార్యక్రమానికి హాజరైన అజేయ కల్లం అన్నారు.

ప్రస్తుతం ప్రతి గ్రామానికి సర్వేయర్ ఉండటంతో భవిష్యత్​లో భూ తగాదాలకు అడ్డుకట్ట వేయవచ్చని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. సర్వేయర్లు సక్రమంగా పని చేస్తే మిగతా శాఖల పని సులువవుతుందని రెవెన్యూశాఖ ప్రధాన కార్యదర్శి ఉషారాణి అన్నారు. రెవెన్యూశాఖ, సర్వే రెండు కళ్లలా పనిచేస్తే భూములకు సంబంధించి ఎలాంటి సమస్యలు తలెత్తవన్నారు. అందుకే సర్వేయర్లు రెవెన్యూశాఖతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. వివిధ ప్రాజెక్టులకు భూములు కేటాయించినా వాటిని ఇంకా రికార్డుల్లో మార్చకపోవటం సరికాదని... ఆ పని ఎప్పటికప్పుడు పూర్తి చేయాలని సర్వేయర్లకు సూచించారు. రిజిస్ట్రేషన్ల విషయంలో మనం ఇంకా మెరుగుపడాలని సర్వే కమిషనర్ సిద్దార్థ జైన్ అన్నారు. సర్వే సేవలు ప్రజలకు సక్రమంగా అందాలని సూచించారు.

జాతీయ సర్వే దినోత్సవం సందర్భంగా గుంటూరులోని వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో కార్యక్రమం నిర్వహించారు. సర్వేశాఖలో పనిచేస్తున్న ఉద్యోగులు, గ్రామ సర్వేయర్లు ఈ సమావేశానికి హాజరయ్యారు. విదేశాల్లో సివిల్ తగాదాల్లో భూములకు సంబంధించినవి 3శాతం లోపే ఉంటాయని.. మన వద్ద పరిస్థితి అందుకు భిన్నంగా ఉందని కార్యక్రమానికి హాజరైన అజేయ కల్లం అన్నారు.

ప్రస్తుతం ప్రతి గ్రామానికి సర్వేయర్ ఉండటంతో భవిష్యత్​లో భూ తగాదాలకు అడ్డుకట్ట వేయవచ్చని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. సర్వేయర్లు సక్రమంగా పని చేస్తే మిగతా శాఖల పని సులువవుతుందని రెవెన్యూశాఖ ప్రధాన కార్యదర్శి ఉషారాణి అన్నారు. రెవెన్యూశాఖ, సర్వే రెండు కళ్లలా పనిచేస్తే భూములకు సంబంధించి ఎలాంటి సమస్యలు తలెత్తవన్నారు. అందుకే సర్వేయర్లు రెవెన్యూశాఖతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. వివిధ ప్రాజెక్టులకు భూములు కేటాయించినా వాటిని ఇంకా రికార్డుల్లో మార్చకపోవటం సరికాదని... ఆ పని ఎప్పటికప్పుడు పూర్తి చేయాలని సర్వేయర్లకు సూచించారు. రిజిస్ట్రేషన్ల విషయంలో మనం ఇంకా మెరుగుపడాలని సర్వే కమిషనర్ సిద్దార్థ జైన్ అన్నారు. సర్వే సేవలు ప్రజలకు సక్రమంగా అందాలని సూచించారు.

ఇదీ చదవండి: కుమార్తెతో సహా తండ్రి ఆత్మహత్య.. తన అవయవాలు భార్యకు ఇవ్వాలని లేఖ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.