ETV Bharat / state

సేంద్రీయ సాగు వైపు రైతులు అడుగులు వేయాలి : నాబార్డు ఛైర్మన్

గుంటూరు జిల్లా అమరావతి మండలం అత్తలూరులో నాబార్డు ఛైర్మన్ చింతల గోవిందరాజులు, మంత్రులు పెద్దిరెడ్డి, కన్నబాబు, ఇతర ప్రజాప్రతినిధులు పర్యటించారు. అత్తలూరులో సేంద్రీయ సాగు విధానాలను పరిశీలించారు. ఈ విధానంలో సాగు చేసే రైతులకు నాబార్డు తరఫున అవార్డులు ఇస్తామని నాబార్డు ఛైర్మన్ గోవిందరాజులు తెలిపారు.

author img

By

Published : Mar 18, 2021, 10:27 PM IST

nabard chairman chinthala govindharjulu tour in atthluru guntur district
నాబార్డు ఛైర్మన్ చింతల గోవిందరాజులు

వ్యవసాయ రంగంలో సేంద్రీయ సాగు వంటి సహజ విధానాల వైపు రైతులు అడుగులు వేయాలని.. నాబార్డు ఛైర్మన్ చింతల గోవిందరాజులు పిలుపునిచ్చారు. భూసారాన్ని పర్యవేక్షించి, పంటల ఉత్పాదకత పెరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. మంత్రులు కురసాల కన్నబాబు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీలు శ్రీకృష్ణదేవరాయలు, బాలశౌరి, ఎమ్మెల్యే నంబూరు శంకర్‌రావుతో కలిసి గుంటూరు జిల్లా అమరావతి మండలం అత్తలూరులో గోవిందరాజులు పర్యటించారు.

అక్కడ సాగవుతున్న సేంద్రీయ వ్యవసాయ విధానాన్ని పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడిన చింతల గోవిందరాజులు... సేంద్రీయ విధానంలో సాగు చేసే రైతులకు నాబార్డు తరఫున అవార్డులు ఇస్తామని తెలిపారు. సేంద్రీయ వ్యవసాయాన్ని విజయవంతంగా నడిపిస్తున్న రైతులను అభినందించిన మంత్రి పెద్దిరెడ్డి.. ప్రభుత్వపరంగా సహాయం అందించాలని వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబును కోరారు. రైతు పక్షపాతిగా జగన్ మోహన్ రెడ్డి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారని తెలిపారు.

వ్యవసాయ రంగంలో సేంద్రీయ సాగు వంటి సహజ విధానాల వైపు రైతులు అడుగులు వేయాలని.. నాబార్డు ఛైర్మన్ చింతల గోవిందరాజులు పిలుపునిచ్చారు. భూసారాన్ని పర్యవేక్షించి, పంటల ఉత్పాదకత పెరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. మంత్రులు కురసాల కన్నబాబు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీలు శ్రీకృష్ణదేవరాయలు, బాలశౌరి, ఎమ్మెల్యే నంబూరు శంకర్‌రావుతో కలిసి గుంటూరు జిల్లా అమరావతి మండలం అత్తలూరులో గోవిందరాజులు పర్యటించారు.

అక్కడ సాగవుతున్న సేంద్రీయ వ్యవసాయ విధానాన్ని పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడిన చింతల గోవిందరాజులు... సేంద్రీయ విధానంలో సాగు చేసే రైతులకు నాబార్డు తరఫున అవార్డులు ఇస్తామని తెలిపారు. సేంద్రీయ వ్యవసాయాన్ని విజయవంతంగా నడిపిస్తున్న రైతులను అభినందించిన మంత్రి పెద్దిరెడ్డి.. ప్రభుత్వపరంగా సహాయం అందించాలని వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబును కోరారు. రైతు పక్షపాతిగా జగన్ మోహన్ రెడ్డి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారని తెలిపారు.

ఇదీచదవండి.

2022 మార్చి నాటికి గుండ్లకమ్మ ప్రాజెక్టును పూర్తి చేస్తాం : కేంద్రం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.