ETV Bharat / state

'ఐదేళ్లలో మంచి పేరు తెచ్చుకోవాలి'

కక్షల వల్ల అభివృద్ధి కుంటుపడుతుందని.. ఈ ఐదేళ్లు ప్రజలకు సేవ చేసి మంచి పేరు తెచ్చుకోవాలని పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన సర్పంచ్​లకు ఎంపీ కృష్ణ దేవరాయలు సూచించారు. మాచర్లలో నిర్వహించిన సర్పంచ్​ల ఆత్మీయ సత్కార సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

author img

By

Published : Mar 2, 2021, 8:24 AM IST

ఎంపీ కృష్ణ దేవరాయలు
ఎంపీ కృష్ణ దేవరాయలు

ఐదేళ్ల కాలం వెంటనే కరిగి పోతుందని... ఉన్నంతలో ప్రజలకు సేవ చేసి మంచి పేరు తెచ్చుకోవాలని పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన సర్పంచ్​లకు నరసరావుపేట ఎంపీ లావు కృష్ణ దేవరాయలు సూచించారు. సోమవారం రాత్రి మాచర్లలో 77 పంచాయతీలలో గెలిచిన సర్పంచ్​లకు ఆత్మీయ సత్కర సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ సభకు ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి అధ్యక్షత వహించారు.

కక్షల వల్ల అభివృద్ధి కుంటు పడుతుందని చెప్పిన ఎంపీ.. ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. నియోజక వర్గంలో అందరి సమష్టి కృషి వల్లే మొత్తం పంచాయతీలు గెలిచామని ప్రభుత్వ విప్ రామ కృష్ణా రెడ్డి పేర్కొన్నారు. రానున్న రోజుల్లో నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి పథంలో నడిపిస్తామని చెప్పారు. నూతనంగా గెలిచిన సర్పంచ్​లను నేతలు సత్కరించారు.

ఐదేళ్ల కాలం వెంటనే కరిగి పోతుందని... ఉన్నంతలో ప్రజలకు సేవ చేసి మంచి పేరు తెచ్చుకోవాలని పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన సర్పంచ్​లకు నరసరావుపేట ఎంపీ లావు కృష్ణ దేవరాయలు సూచించారు. సోమవారం రాత్రి మాచర్లలో 77 పంచాయతీలలో గెలిచిన సర్పంచ్​లకు ఆత్మీయ సత్కర సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ సభకు ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి అధ్యక్షత వహించారు.

కక్షల వల్ల అభివృద్ధి కుంటు పడుతుందని చెప్పిన ఎంపీ.. ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. నియోజక వర్గంలో అందరి సమష్టి కృషి వల్లే మొత్తం పంచాయతీలు గెలిచామని ప్రభుత్వ విప్ రామ కృష్ణా రెడ్డి పేర్కొన్నారు. రానున్న రోజుల్లో నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి పథంలో నడిపిస్తామని చెప్పారు. నూతనంగా గెలిచిన సర్పంచ్​లను నేతలు సత్కరించారు.

ఇదీ చదవండి:

ప్రభుత్వ ఉద్యోగమన్నాడు.. ఐదు లక్షలు కాజేశాడు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.