ETV Bharat / state

అంత్యక్రియలకు ఫీజులు.. వెల్లువెత్తుతున్న విమర్శలు

author img

By

Published : May 9, 2021, 7:27 PM IST

కరోనా ఆపద కాలంలో ప్రజలకు అండగా ఉండాల్సిన అధికారులు నూతన విధానానికి తెరతీశారు. గుంటూరు నగరపాలకసంస్థ ఆధ్వర్యంలోని శ్మశానవాటికల్లో అంత్యక్రియలకు ఫీజులు నిర్దేశిస్తూ బోర్డు ఏర్పాటు చేశారు. ఈ చర్య.. వివాదాస్పదమవుతోంది.

money gathering for cremation in old guntur
అంత్యక్రియలకు ఫీజుల నిర్ధరణపై విమర్శలు

పాత గుంటూరు హిందూ శ్మశానవాటికలో సాధారణ మృతదేహం దహనానికి రూ.2,200... కొవిడ్ మృతదేహం దహనానికి రూ.5,100 అంటూ నగరపాలకసంస్థ బోర్డులు పెట్టడం వివాదాస్పదమైంది. సామాజిక మాధ్యమాల్లో ఈ విషయంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

కరోనా విజృంభిస్తున్న ప్రస్తుత సమయంలో అంత్యక్రియల కోసం ఇంత మొత్తంలో డబ్బు వసూలు చేయడంపై ప్రజలు మండిపడుతున్నారు. స్పందించిన అధికారులు బోర్డును తీసేశారు. పేద ప్రజలకు ఉచితంగానే అంత్యక్రియలు చేపట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

పాత గుంటూరు హిందూ శ్మశానవాటికలో సాధారణ మృతదేహం దహనానికి రూ.2,200... కొవిడ్ మృతదేహం దహనానికి రూ.5,100 అంటూ నగరపాలకసంస్థ బోర్డులు పెట్టడం వివాదాస్పదమైంది. సామాజిక మాధ్యమాల్లో ఈ విషయంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

కరోనా విజృంభిస్తున్న ప్రస్తుత సమయంలో అంత్యక్రియల కోసం ఇంత మొత్తంలో డబ్బు వసూలు చేయడంపై ప్రజలు మండిపడుతున్నారు. స్పందించిన అధికారులు బోర్డును తీసేశారు. పేద ప్రజలకు ఉచితంగానే అంత్యక్రియలు చేపట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

ఇదీ చదవండి:

రాష్ట్రంలో కొత్తగా 22,164 కరోనా కేసులు, 92 మరణాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.