ETV Bharat / state

విను'కొండ'పైకి.. రోప్ వే కు అనుమతి తీసుకున్నాం: ఎమ్మెల్యే

author img

By

Published : Oct 14, 2020, 9:12 PM IST

వినుకొండ మున్సిపాలిటీ కి చెందిన 22 ఎకరాల స్థలంలో ఎటువంటి కమ్యూనిటీలకు, పార్టీలకు ఇచ్చే ప్రసక్తే లేదని ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు తేల్చి చెప్పారు. నియోజకవర్గంలో ఇంటింటికి తాగునీరు అందించే అందుకు 4 మండలాలకు 20 కోట్ల రూపాయలు శాంక్షన్ అయినట్లు తెలిపారు. రైతులు తమ సమస్యలను నేరుగా తెలియజేయవచ్చని అన్నారు.

MLA Bolla Brahmanayudu
ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు

గుంటూరు జిల్లా, వినుకొండ నగరంలోని ఎన్సీపీ భూములలో 22 ఎకరాలు తిరిగి మునిసిపాలిటీ అభివృద్ధికి ప్రభుత్వం అందించినందుకు ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు హర్షం వ్యక్తం చేశారు. ఈ స్థలంలో ఎటువంటి కమ్యూనిటీలకు , పార్టీలకు అన్యాక్రాంత చేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. నియోజకవర్గంలో ఇంటింటికి తాగునీరు అందించే అందుకు 4 మండలాలకు 20 కోట్ల రూపాయలు మంజూరు అయినట్లు తెలిపారు.

వినుకొండలోని కొండపైకి ఘాట్ రోడ్డు నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేస్తామని ... "రోప్ వే" కోసం అనుమతి తీసుకున్నట్లు వివరించారు. నియోజకవర్గ ప్రజలకు , రైతులకు అన్ని వేళలా అందుబాటులో ఉంటానని ఎవరికి ఏ సమస్య వచ్చినా నేరుగా తనకు తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు.

గుంటూరు జిల్లా, వినుకొండ నగరంలోని ఎన్సీపీ భూములలో 22 ఎకరాలు తిరిగి మునిసిపాలిటీ అభివృద్ధికి ప్రభుత్వం అందించినందుకు ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు హర్షం వ్యక్తం చేశారు. ఈ స్థలంలో ఎటువంటి కమ్యూనిటీలకు , పార్టీలకు అన్యాక్రాంత చేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. నియోజకవర్గంలో ఇంటింటికి తాగునీరు అందించే అందుకు 4 మండలాలకు 20 కోట్ల రూపాయలు మంజూరు అయినట్లు తెలిపారు.

వినుకొండలోని కొండపైకి ఘాట్ రోడ్డు నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేస్తామని ... "రోప్ వే" కోసం అనుమతి తీసుకున్నట్లు వివరించారు. నియోజకవర్గ ప్రజలకు , రైతులకు అన్ని వేళలా అందుబాటులో ఉంటానని ఎవరికి ఏ సమస్య వచ్చినా నేరుగా తనకు తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు.

ఇదీ చదవండి:

రజనీకాంత్​పై మద్రాసు హైకోర్టు ఆగ్రహం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.