గుంటూరు జిల్లా రేపల్లె మండలం గంగడిపాలెం గ్రామానికి చెందిన మోకా బాల సుందరయ్య చేపల వేట జీవనాధారంగా చేసుకుని జీవిస్తున్నాడు. ఎప్పటిలాగే వేటకు కృష్ణ నదిలోకి వెళ్ళాడు. తిరిగి వస్తూ గంగడిపాలెం కృష్ణ కెనాల్ వద్ద వల విసరగా... ప్రమాదవశాత్తూ బాలసుందరయ్య నీటిలో పడ్డాడు. ప్రవాహం ఎక్కువగా ఉండగా.. మునిగిపోయి ప్రాణం విడిచాడు.
విషయం తెలుసుకున్న స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటన పై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం రేపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఉపాధే ఊపిరి తీసిందంటూ కుటుంబ సభ్యులు తీరని ఆవేదనకు గురయ్యారు.
ఇదీ చదవండి:
రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారు.. వాళ్లకే ఛాన్స్