ETV Bharat / state

గంగడిపాలెంలో చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి

author img

By

Published : Jul 20, 2020, 7:57 PM IST

రేపల్లె మండలం గంగడిపాలెం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి రోజులాగే చేపల వేటకు వెళ్లి వల విసిరాడు. ప్రమాదవశాత్తు కృష్ణా నదిలో పడి మృతి చెందాడు. ఉపాధే ఊపిరి తీసిందంటూ కుటుంబీకులు తీరని ఆవేదనకు గురయ్యారు.

A man went fishing in Gangadipalem and died
గంగడిపాలెంలో చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి

గుంటూరు జిల్లా రేపల్లె మండలం గంగడిపాలెం గ్రామానికి చెందిన మోకా బాల సుందరయ్య చేపల వేట జీవనాధారంగా చేసుకుని జీవిస్తున్నాడు. ఎప్పటిలాగే వేటకు కృష్ణ నదిలోకి వెళ్ళాడు. తిరిగి వస్తూ గంగడిపాలెం కృష్ణ కెనాల్ వద్ద వల విసరగా... ప్రమాదవశాత్తూ బాలసుందరయ్య నీటిలో పడ్డాడు. ప్రవాహం ఎక్కువగా ఉండగా.. మునిగిపోయి ప్రాణం విడిచాడు.

విషయం తెలుసుకున్న స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటన పై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం రేపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఉపాధే ఊపిరి తీసిందంటూ కుటుంబ సభ్యులు తీరని ఆవేదనకు గురయ్యారు.

గుంటూరు జిల్లా రేపల్లె మండలం గంగడిపాలెం గ్రామానికి చెందిన మోకా బాల సుందరయ్య చేపల వేట జీవనాధారంగా చేసుకుని జీవిస్తున్నాడు. ఎప్పటిలాగే వేటకు కృష్ణ నదిలోకి వెళ్ళాడు. తిరిగి వస్తూ గంగడిపాలెం కృష్ణ కెనాల్ వద్ద వల విసరగా... ప్రమాదవశాత్తూ బాలసుందరయ్య నీటిలో పడ్డాడు. ప్రవాహం ఎక్కువగా ఉండగా.. మునిగిపోయి ప్రాణం విడిచాడు.

విషయం తెలుసుకున్న స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటన పై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం రేపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఉపాధే ఊపిరి తీసిందంటూ కుటుంబ సభ్యులు తీరని ఆవేదనకు గురయ్యారు.

ఇదీ చదవండి:

రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారు.. వాళ్లకే ఛాన్స్

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.