mammography-service-in-guntur: ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమాన్ని వచ్చే ఏడాది ఉగాదిన రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ప్రారంభిస్తారని వైద్యారోగ్య శాఖ మంత్రి విడదల రజని వెల్లడించారు. జీజీహెచ్ నాట్కో కేంద్రంలో గడ్డిపాటి కస్తూరిదేవి, రామమోహన్రావు, శివరామకృష్ణ సౌజన్యంతో ఏర్పాటు చేసిన డిజిటల్ మామోగ్రాఫి పరికరాన్ని ఆమె ప్రారంభించారు. బ్రెస్ట్ క్యాన్సర్ను ముందే గుర్తించే మామోగ్రఫీ పరికరం రాష్ట్రంలో మొదటిసారిగా గుంటూరు జీజీహెచ్లో అందుబాటులోకి వచ్చిందని మంత్రి రజని చెప్పారు. విశాఖలో క్యాన్సర్ చికిత్సలకు హోమీ బాబా ఆసుపత్రితో ఒప్పందం చేసుకున్నామని, క్యాన్సర్ వైద్యం కోసం బయట రాష్ట్రాలకు వెళ్లకూడదన్న లక్ష్యంతో పని చేస్తున్నామని అన్నారు.
ఇవీ చదవండి: