ETV Bharat / state

Lokesh Defamation Case on Posani: అసత్య ఆరోపణలు చేసిన వారిని వదిలిపెట్టను: లోకేశ్​

author img

By

Published : Aug 18, 2023, 9:02 PM IST

Updated : Aug 19, 2023, 6:52 AM IST

Lokesh Defamation Case on Posani: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్​ మంగళగిరి కోర్టులో హాజరయ్యారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో మంగళగిరి నుంచి పోటీ చేసి.. భారీ మెజారీటితో విజయం సాధిస్తానని అన్నారు. అధికారంలో లేనప్పటికీ మంగళగిరి అభివృద్ధి కోసం కృషి చేశానని గుర్తు చేశారు.

Lokesh_Gives_his_Statement_on_Defamation_Case_in_Mangalagiri_Court
Lokesh_Gives_his_Statement_on_Defamation_Case_in_Mangalagiri_Court

Lokesh Statement on Defamation Case in Mangalagiri Court: తాను ఒక నియంతపై.. ఒక పెత్తందారు, వైసీపీ గ్లోబల్​ ప్రచారంపై పోరాటం చేస్తున్నానని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి తెలిపారు. తనపై తప్పుడు ఆరోపణలతో నిందలు మోపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అసత్య ఆరోపణలు చేసినందకు.. పోసానిపై, సింగ‌లూరు శాంతి ప్రసాద్​పై ప‌రువున‌ష్టం కేసు దాఖలు చేయగా.. తన వాంగ్మూలం ఇచ్చేందుకు లోకేశ్​ కోర్టుకు హాజరయ్యారు. నిందలపై న్యాయం కోసం కోర్టును ఆశ్రయించినట్లు వివరించారు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో మంగళగిరి నుంచే తాను పోటీ చేయనున్నట్లు తెలిపారు. ఈ ఎన్నికల్లో తానే విజయం సాధించనున్నట్లు ఆయన ధీమా వ్యక్తం చేశారు.

తన తల్లి దగ్గర్నుంచి తన కుమారుడు దేవాన్ష్ వరకు ఎవర్ని వదిలిపెట్టకుండా.. అందరిపై వైసీపీ నాయకులు అనేక అసత్య ఆరోపణలు చేశారని ఎవర్ని వదిలిపెట్టానని లోకేశ్​ హెచ్చరించారు. చేసిన ఆరోపణలను నిరూపించాల్సిన బాధ్యత వైసీపీ నాయకులపై ఉందని ఆయన అన్నారు. ఏపీ ఫిల్మ్ డెవ‌ల‌ప్​మెంట్​ కార్పొరేష‌న్ చైర్మన్ పోసాని కృష్ణముర‌ళి తనపై తప్పుడు, అసత్య ఆరోపణలు చేస్తున్నారని.. మంగళగిరి కోర్టును లోకేశ్​ ఆశ్రయించగా.. శుక్రవారం తన వాంగ్మూలన్ని కోర్టుకు అందించారు.

Nara Lokesh Fire on CM Jagan About Margadarsi: ''మార్గదర్శిపై దాడులతో భయపెట్టాలని చూడటం.. సైకో చర్యలే''

పోసాని ఓ యూట్యూబ్​ ఛానల్​కి ఇచ్చిన ఇంటర్వూలో.. లోకేశ్​ కంతేరులో 14 ఎక‌రాల భూముల్ని కొనుగోలు చేశారనే ఆరోపణలు చేశారని పేర్కొన్నారు. కంతేరుల తనకు అరసెంటు భూమి కూడా లేదని వివరించారు. తనపై ఇలా తప్పుడు ఆరోపణలు చేసిన పోసాని క్షమాపణ చెప్పాలని.. తన న్యాయవాది ద్వారా గతంలో రెండు సార్లు నోటీసులు పంపించినట్లు వివరించారు. అయినప్పటికీ పోసాని స్పందించలేదని.. ఎటువంటి సమాధానం ఇవ్వలేదని అన్నారు. తన పరువు, ప్రతిష్టలకు భంగం కలిగించిన పోసానిపై చర్యలు తీసుకోవాలని లోకేశ్​ కోర్టును ఆశ్రయించారు..

సింగలూరు శాంతి ప్రసాద్​​ అనే వ్యక్తి కూడా ఓ యూట్యూబ్​ ఛానల్​ నిర్వహించిన చర్చా కార్యక్రమంలో.. శాంతి ప్రసాద్​ అనే వ్యక్తి ఎటువంటి ఆధారాలు లేకుండా అవినీతి బుర‌ద అంటించాల‌ని చూశారంటూ అతనిపై కూడా పరువు నష్టం కేసు దాఖలు చేశారు. ఉద్యోగుల జీతాల నుంచి వసూళ్లు చేయిస్తున్నారని సింగ‌లూరు శాంతి ప్రసాద్ ఆరోపణలు చేశారని లోకేశ్​ కోర్టును ఆశ్రయించారు.

Nara Lokesh Meeting with Auditors: కక్షసాధింపులు చేస్తే కంపెనీలు రావు! రాజకీయం వేరు.. వ్యాపారం వేరు!: లోకేశ్

Lokesh Fired On CM Jagan: జగన్​పై మండిపడ్డ లోకేశ్​.. ముఖ్యమంత్రి జగన్​మోహన్​ రెడ్డిపై లోకేశ్​ విమర్శలు గుప్పించారు. తాను పాస్​పోర్ట్​, వీసాతో విదేశాలకు వెళ్తున్నానని.. కానీ, సీఎం జగన్​ మాత్రం విదేశాలకు వెళ్లాలంటే కోర్టు అనుమతి కావాలని ఎద్దేవా చేశారు. తనది కాలేజ్​ లైఫ్​ అయితే జగన్​ది జైల్​ లైఫ్​ అని దుయ్యబట్టారు.

"పోసానికి సూటిగా లీగల్​ నోటీసులు అందించాను. అయినప్పటికీ స్పందించలేదు. రెండుసార్లు లీగల్​ నోటీసులు రిజెక్ట్​ చేశారు. ఎందుకు రిజెక్ట్​ చేశారో సమాధానం ఇవ్వలేదు. వైసీపీ నాయకులు ఆరోపణలు చేసి పారిపోతే.. ఆ బురద మేము తుడుచుకోవాలా. దానికి చెక్​ పెట్టేందుకే ఈ రోజు పరువు నష్టం కేసు వేశాను." -నారా లోకేశ్​

Nara Lokesh Yuvagalam Padayatra: చంద్రబాబు నీళ్లు పారిస్తానంటే.. జగన్ రక్తం పారిస్తున్నాడు: లోకేశ్

Lokesh Statement on Defamation Case in Mangalagiri Court: తాను ఒక నియంతపై.. ఒక పెత్తందారు, వైసీపీ గ్లోబల్​ ప్రచారంపై పోరాటం చేస్తున్నానని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి తెలిపారు. తనపై తప్పుడు ఆరోపణలతో నిందలు మోపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అసత్య ఆరోపణలు చేసినందకు.. పోసానిపై, సింగ‌లూరు శాంతి ప్రసాద్​పై ప‌రువున‌ష్టం కేసు దాఖలు చేయగా.. తన వాంగ్మూలం ఇచ్చేందుకు లోకేశ్​ కోర్టుకు హాజరయ్యారు. నిందలపై న్యాయం కోసం కోర్టును ఆశ్రయించినట్లు వివరించారు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో మంగళగిరి నుంచే తాను పోటీ చేయనున్నట్లు తెలిపారు. ఈ ఎన్నికల్లో తానే విజయం సాధించనున్నట్లు ఆయన ధీమా వ్యక్తం చేశారు.

తన తల్లి దగ్గర్నుంచి తన కుమారుడు దేవాన్ష్ వరకు ఎవర్ని వదిలిపెట్టకుండా.. అందరిపై వైసీపీ నాయకులు అనేక అసత్య ఆరోపణలు చేశారని ఎవర్ని వదిలిపెట్టానని లోకేశ్​ హెచ్చరించారు. చేసిన ఆరోపణలను నిరూపించాల్సిన బాధ్యత వైసీపీ నాయకులపై ఉందని ఆయన అన్నారు. ఏపీ ఫిల్మ్ డెవ‌ల‌ప్​మెంట్​ కార్పొరేష‌న్ చైర్మన్ పోసాని కృష్ణముర‌ళి తనపై తప్పుడు, అసత్య ఆరోపణలు చేస్తున్నారని.. మంగళగిరి కోర్టును లోకేశ్​ ఆశ్రయించగా.. శుక్రవారం తన వాంగ్మూలన్ని కోర్టుకు అందించారు.

Nara Lokesh Fire on CM Jagan About Margadarsi: ''మార్గదర్శిపై దాడులతో భయపెట్టాలని చూడటం.. సైకో చర్యలే''

పోసాని ఓ యూట్యూబ్​ ఛానల్​కి ఇచ్చిన ఇంటర్వూలో.. లోకేశ్​ కంతేరులో 14 ఎక‌రాల భూముల్ని కొనుగోలు చేశారనే ఆరోపణలు చేశారని పేర్కొన్నారు. కంతేరుల తనకు అరసెంటు భూమి కూడా లేదని వివరించారు. తనపై ఇలా తప్పుడు ఆరోపణలు చేసిన పోసాని క్షమాపణ చెప్పాలని.. తన న్యాయవాది ద్వారా గతంలో రెండు సార్లు నోటీసులు పంపించినట్లు వివరించారు. అయినప్పటికీ పోసాని స్పందించలేదని.. ఎటువంటి సమాధానం ఇవ్వలేదని అన్నారు. తన పరువు, ప్రతిష్టలకు భంగం కలిగించిన పోసానిపై చర్యలు తీసుకోవాలని లోకేశ్​ కోర్టును ఆశ్రయించారు..

సింగలూరు శాంతి ప్రసాద్​​ అనే వ్యక్తి కూడా ఓ యూట్యూబ్​ ఛానల్​ నిర్వహించిన చర్చా కార్యక్రమంలో.. శాంతి ప్రసాద్​ అనే వ్యక్తి ఎటువంటి ఆధారాలు లేకుండా అవినీతి బుర‌ద అంటించాల‌ని చూశారంటూ అతనిపై కూడా పరువు నష్టం కేసు దాఖలు చేశారు. ఉద్యోగుల జీతాల నుంచి వసూళ్లు చేయిస్తున్నారని సింగ‌లూరు శాంతి ప్రసాద్ ఆరోపణలు చేశారని లోకేశ్​ కోర్టును ఆశ్రయించారు.

Nara Lokesh Meeting with Auditors: కక్షసాధింపులు చేస్తే కంపెనీలు రావు! రాజకీయం వేరు.. వ్యాపారం వేరు!: లోకేశ్

Lokesh Fired On CM Jagan: జగన్​పై మండిపడ్డ లోకేశ్​.. ముఖ్యమంత్రి జగన్​మోహన్​ రెడ్డిపై లోకేశ్​ విమర్శలు గుప్పించారు. తాను పాస్​పోర్ట్​, వీసాతో విదేశాలకు వెళ్తున్నానని.. కానీ, సీఎం జగన్​ మాత్రం విదేశాలకు వెళ్లాలంటే కోర్టు అనుమతి కావాలని ఎద్దేవా చేశారు. తనది కాలేజ్​ లైఫ్​ అయితే జగన్​ది జైల్​ లైఫ్​ అని దుయ్యబట్టారు.

"పోసానికి సూటిగా లీగల్​ నోటీసులు అందించాను. అయినప్పటికీ స్పందించలేదు. రెండుసార్లు లీగల్​ నోటీసులు రిజెక్ట్​ చేశారు. ఎందుకు రిజెక్ట్​ చేశారో సమాధానం ఇవ్వలేదు. వైసీపీ నాయకులు ఆరోపణలు చేసి పారిపోతే.. ఆ బురద మేము తుడుచుకోవాలా. దానికి చెక్​ పెట్టేందుకే ఈ రోజు పరువు నష్టం కేసు వేశాను." -నారా లోకేశ్​

Nara Lokesh Yuvagalam Padayatra: చంద్రబాబు నీళ్లు పారిస్తానంటే.. జగన్ రక్తం పారిస్తున్నాడు: లోకేశ్

Last Updated : Aug 19, 2023, 6:52 AM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.