ప్రశాంతంగా ఉన్న ప్రాంతంలో తెదేపా సమస్యలు సృష్టిస్తోందని గుంటూరు జిల్లా పెదనందిపాడు మండల వైకాపా మండల కన్వీనర్, కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ మదమంచి వాసు ఆరోపించారు. కొప్పర్రు దాడి ఘటనను తెదేపా ప్రణాళిక ప్రకారం జరిపిందని అన్నారు. తెదేపా నేతలు.. వైకాపా కార్యకర్తల్ని రెచ్చగొట్టారని తెలిపారు. తమ పార్టీ కార్యకర్తైన శ్రీకాంత్ను ఓ ఇంట్లోకి లాక్కెళ్లి..తలుపులు వేసి తెదేపా వాళ్లు తీవ్రంగా కొట్టారని అన్నారు. తలుపులు ఎంతకీ తీయలేదని తెలిపారు. పోలీసులు అటువైపు నుంచి వచ్చి తలుపులు తీస్తే.. శ్రీకాంత్ అపస్మారక స్థితిలో ఉన్నాడని వెల్లడించారు. వెంటనే హుటాహుటిన ఆసుపత్రికి తరలించామని తెలిపారు.
కాగా శ్రీకాంత్ చనిపోయాడని భావించి..ఆ తప్పును కప్పిపుచ్చుకోవడానికి తెదేపా నేతలే ఆయా ప్రదేశాల్లో దాడులు చేసి..తమపై నెట్టారని అన్నారు. తెదేపా వాళ్లు చేసిన దాడిలో తమ కార్యకర్తలు 8 మంది గాయపడ్డారని తెలిపారు. అయినా పోలీసులు తమ కార్యకర్తల్నే అరెస్టు చేశారని ఆరోపించారు. తెదేపా నేతలు, కార్యకర్తలను ఇప్పటివరకూ పోలీసులు అరెస్ట్ చేయలేదన్నారు.
ఇదీ చదవండి: ప్రతిపక్ష నేతల గొంతు నొక్కే చర్యలు సరికాదు: నిమ్మల రామానాయుడు