ETV Bharat / state

కృష్ణా, గుంటూరు జిల్లాల్లో జోరు వాన.. నీటిపాలైన పంట

కృష్ణా, గుంటూరు జిల్లాల్లో.. వేల ఎకరాల్లో పంటలు నీటమునిగాయి. లోతట్ట ప్రాంతాల్లోని జనావాసాల్లోకి నీరు చేరి జనజీవనం అస్తవ్యస్తమైంది.

author img

By

Published : Oct 14, 2020, 3:42 AM IST

కృష్ణా, గుంటూరు జిల్లాల్లో జోరు వాన.. నీటిపాలైన పంట
కృష్ణా, గుంటూరు జిల్లాల్లో జోరు వాన.. నీటిపాలైన పంట

వాయుగుండం ప్రభావంతో కురిసిన వర్షాలకు.... గుంటూరు జిల్లాలో వేల ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. పెదపరిమి వద్ద కొట్టేళ్ల వాగు ఉద్ధృతికి తుళ్లూరు దిశలో.... రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అమరావతి నుంచి విజయవాడ వెళ్లే మార్గంలో పెదమద్దూరు వద్ద.. కొండవీటి వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దుగ్గిరాల మండలం పేరుకలపూడిలో మరణించిన ఓ వ్యక్తి మృతదేహాన్ని వరద నీటి మధ్యే వాహనంలో తరలించారు. మేడికొండురు మండలం పాలడుగు వద్ద.. వాగు ఉద్ధృతికి పేదలకు కేటాయించిన ఇళ్ల స్థలాలు, పంట పొలాలు నీట మునిగాయి. సత్తెనపల్లిలోని వావిలాల ఘాట్ ప్రాంతంలో ఇళ్లలోకి నీరు చేరింది. పెదకూరపాడు మండలం కంభంపాడు వాగు వద్ద కారు వరదలో కొట్టుకుపోగా స్థానికులు తాళ్ల సాయంతో ఒడ్డుకు చేర్చారు. కృష్ణా తీరం వెంట వేలాది ఎకరాల్లో పంటపొలాలు నీటమునిగాయి. పత్తి, మిరప, కంద, పసుపు, కూరగాయల పంటలు వరదలో చిక్కుకున్నాయి.

మంగళగిరి, తుళ్లూరు, తాడేపల్లి, తాడికొండ మండలాల్లో ఎక్కువగా పంటలు దెబ్బతిన్నాయి. మిర్చి, పత్తి, మినుములు, పసుపు, చెరకు పంటలకు నష్టం వాటిల్లింది. ఇప్పటికే ఖరీఫ్‌ సీజన్​లో జిల్లాలో 32 శాతం అధిక వర్షపాతం నమోదైందన్న వ్యవసాయ అధికారులు..వానలు ఇంకా కొనసాగితే మరింత..... ప్రమాదమన్నారు. మాచర్ల నియోజకవర్గంలో పంట పొలాల్లోకి నీరు చేరి అన్నదాతలు దిగాలు పడ్డారు. కొప్పునూరు, ద్వారకాపురి, విజయ పురి సౌత్ గ్రామాల వైపు రాకపోకలు నిలిచిపోయాయి. చంద్రవంక వాగు ఉద్ధృతికి జనావాసాలు నీటమునిగాయి. చప్టాపై ప్రవాహంతో పలు గ్రామాలకు రాకపోకలునిలిచిపోయాయి. వాగులో చిక్కుకున్న ఓ వ్యక్తిని పోలీసులు కాపాడారు. అచ్చంపేట మండలంలో వరదని పరిశీలించేందుకు వెళ్లిన పోలీసు బృందం వాహనంతో సహా ప్రవాహంలో చిక్కుకున్నారు. స్థానికుల సాయంతో ఒడ్డుకు చేరారు.

వర్షాలు తగ్గేదాకా దుర్గ గుడి ఘాట్‌రోడ్‌పైకి భక్తులను అనుమతించబోమని ఛైర్మన్‌ పైలా సోమినాయుడు తెలిపారు. కొండ చరియలు విరిగి పడినప్రాంతాన్ని..పరిశీలించారు. వర్షం తగ్గాక పూర్తి స్థాయిలో మెష్‌ ఏర్పాటు చేసి.. దసరా నాటికి భక్తులకు ఇబ్బందులు లేకుండా గట్టి ఏర్పాట్లు చేస్తామన్నారు.

మచిలీపట్నంలో వర్షంలో చిక్కుకున్న నిరాశ్రయురాలైన వృద్ధురాలికి పోలీసులు సాయం అందించారు. బందరు డీఎస్పీ మహబూబ్ బాషా చొరవతో స్థానిక పోలీసులు వృద్ధురాలికి, వస్త్రాలు, ఆహారం అందించారు. కృష్ణా జిల్లా జి.కొండూరు మండలంలోని సున్నంపాడులో వరద ఉద్ధృతి స్థానిక ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ పరిశీలించారు.

ఇదీ చదవండి: తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు.. దెబ్బతిన్న పంటలు

వాయుగుండం ప్రభావంతో కురిసిన వర్షాలకు.... గుంటూరు జిల్లాలో వేల ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. పెదపరిమి వద్ద కొట్టేళ్ల వాగు ఉద్ధృతికి తుళ్లూరు దిశలో.... రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అమరావతి నుంచి విజయవాడ వెళ్లే మార్గంలో పెదమద్దూరు వద్ద.. కొండవీటి వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దుగ్గిరాల మండలం పేరుకలపూడిలో మరణించిన ఓ వ్యక్తి మృతదేహాన్ని వరద నీటి మధ్యే వాహనంలో తరలించారు. మేడికొండురు మండలం పాలడుగు వద్ద.. వాగు ఉద్ధృతికి పేదలకు కేటాయించిన ఇళ్ల స్థలాలు, పంట పొలాలు నీట మునిగాయి. సత్తెనపల్లిలోని వావిలాల ఘాట్ ప్రాంతంలో ఇళ్లలోకి నీరు చేరింది. పెదకూరపాడు మండలం కంభంపాడు వాగు వద్ద కారు వరదలో కొట్టుకుపోగా స్థానికులు తాళ్ల సాయంతో ఒడ్డుకు చేర్చారు. కృష్ణా తీరం వెంట వేలాది ఎకరాల్లో పంటపొలాలు నీటమునిగాయి. పత్తి, మిరప, కంద, పసుపు, కూరగాయల పంటలు వరదలో చిక్కుకున్నాయి.

మంగళగిరి, తుళ్లూరు, తాడేపల్లి, తాడికొండ మండలాల్లో ఎక్కువగా పంటలు దెబ్బతిన్నాయి. మిర్చి, పత్తి, మినుములు, పసుపు, చెరకు పంటలకు నష్టం వాటిల్లింది. ఇప్పటికే ఖరీఫ్‌ సీజన్​లో జిల్లాలో 32 శాతం అధిక వర్షపాతం నమోదైందన్న వ్యవసాయ అధికారులు..వానలు ఇంకా కొనసాగితే మరింత..... ప్రమాదమన్నారు. మాచర్ల నియోజకవర్గంలో పంట పొలాల్లోకి నీరు చేరి అన్నదాతలు దిగాలు పడ్డారు. కొప్పునూరు, ద్వారకాపురి, విజయ పురి సౌత్ గ్రామాల వైపు రాకపోకలు నిలిచిపోయాయి. చంద్రవంక వాగు ఉద్ధృతికి జనావాసాలు నీటమునిగాయి. చప్టాపై ప్రవాహంతో పలు గ్రామాలకు రాకపోకలునిలిచిపోయాయి. వాగులో చిక్కుకున్న ఓ వ్యక్తిని పోలీసులు కాపాడారు. అచ్చంపేట మండలంలో వరదని పరిశీలించేందుకు వెళ్లిన పోలీసు బృందం వాహనంతో సహా ప్రవాహంలో చిక్కుకున్నారు. స్థానికుల సాయంతో ఒడ్డుకు చేరారు.

వర్షాలు తగ్గేదాకా దుర్గ గుడి ఘాట్‌రోడ్‌పైకి భక్తులను అనుమతించబోమని ఛైర్మన్‌ పైలా సోమినాయుడు తెలిపారు. కొండ చరియలు విరిగి పడినప్రాంతాన్ని..పరిశీలించారు. వర్షం తగ్గాక పూర్తి స్థాయిలో మెష్‌ ఏర్పాటు చేసి.. దసరా నాటికి భక్తులకు ఇబ్బందులు లేకుండా గట్టి ఏర్పాట్లు చేస్తామన్నారు.

మచిలీపట్నంలో వర్షంలో చిక్కుకున్న నిరాశ్రయురాలైన వృద్ధురాలికి పోలీసులు సాయం అందించారు. బందరు డీఎస్పీ మహబూబ్ బాషా చొరవతో స్థానిక పోలీసులు వృద్ధురాలికి, వస్త్రాలు, ఆహారం అందించారు. కృష్ణా జిల్లా జి.కొండూరు మండలంలోని సున్నంపాడులో వరద ఉద్ధృతి స్థానిక ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ పరిశీలించారు.

ఇదీ చదవండి: తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు.. దెబ్బతిన్న పంటలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.