ETV Bharat / state

కరోనా రెడ్ జోన్స్ @ గుంటూరు జిల్లా - shoutdown AP due to corona virus taja news

రాష్ట్రంలోనే అధిక సంఖ్యలో కరోనా పాజిటివ్​ కేసులు గుంటూరు జిల్లాలో నమోదయ్యాయి. ఈ ప్రమాదంపై.. అధికార యంత్రాంగం మరింత అప్రమత్తమైంది. 144 సెక్షన్​ను కఠినంగా అమలు చేస్తోంది.

guntur dst officers highalet due to more number of corona virus
పాజిటీవ్​ కేసులో మరింత అప్రమత్తమైన జిల్లా యంత్రాంగం
author img

By

Published : Apr 2, 2020, 12:01 PM IST

Updated : Apr 2, 2020, 3:57 PM IST

పాజిటీవ్​ కేసులో మరింత అప్రమత్తమైన జిల్లా యంత్రాంగం

గుంటూరు జిల్లా మంగళగిరిలో కరోనా పాజిటివ్ కేసు నమోదుపై అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. దిల్లీ నిజాముద్దీన్ ప్రార్థనలో పాల్గొన్న ఇద్దరిలో ఒకరికి పాజిటివ్ రాగా మరొకరు క్వారంటైన్​లో ఉన్నారు. పాజిటివ్ కేసు నమోదైన టిప్పర్ల బజార్ నుంచి అధికారులు మూడు కిలోమీటర్ల పరిధిలో ఉన్న ప్రాంతాన్ని రెడ్ జోన్​గా ప్రకటించారు. మంగళగిరిలో ఉదయం నుంచే తెరిచి ఉన్న నిత్యావసర, కూరగాయల దుకాణాలను మూయించారు. 144 సెక్షన్​ను పక్కాగా అమలు చేస్తున్నారు. పట్టణం మొత్తం హైపో ద్రావకం చల్లుతున్నారు. పోలీసులు మైక్​లో విస్తృతంగా ప్రచారం చేపట్టారు. మంగళగిరి రెడ్​జోన్​లో ఉన్నందున ఎవరూ బయటకు రావద్దని పోలీసులు హెచ్చరించారు.

తాడికొండ నియోజకవర్గంలోని మేడికొండూరు మండలం తురకపాలెం రెడ్​జోన్​గా ప్రకటించారు. గ్రామానికి చెందిన ఒకరికి కరోనా పాజిటివ్​ అని తేలడంపై.. అధికారులు ముందు జాగ్రత్తలు తీసుకున్నారు. గ్రామంలో బ్లీచింగ్ చల్లారు. ఇళ్ల నుంచి ఎవరూ బయటకు రావొద్దని హెచ్చరికలు జారీ చేశారు.

వీటితో పాటు.. అచ్చంపేట, క్రోసూరులను రెడ్‌జోన్లుగా అధికారులు ప్రకటించారు.

ఇదీ చూడండి:

కరోనా నియంత్రణకు ప్రభుత్వ చర్యలేంటి?

పాజిటీవ్​ కేసులో మరింత అప్రమత్తమైన జిల్లా యంత్రాంగం

గుంటూరు జిల్లా మంగళగిరిలో కరోనా పాజిటివ్ కేసు నమోదుపై అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. దిల్లీ నిజాముద్దీన్ ప్రార్థనలో పాల్గొన్న ఇద్దరిలో ఒకరికి పాజిటివ్ రాగా మరొకరు క్వారంటైన్​లో ఉన్నారు. పాజిటివ్ కేసు నమోదైన టిప్పర్ల బజార్ నుంచి అధికారులు మూడు కిలోమీటర్ల పరిధిలో ఉన్న ప్రాంతాన్ని రెడ్ జోన్​గా ప్రకటించారు. మంగళగిరిలో ఉదయం నుంచే తెరిచి ఉన్న నిత్యావసర, కూరగాయల దుకాణాలను మూయించారు. 144 సెక్షన్​ను పక్కాగా అమలు చేస్తున్నారు. పట్టణం మొత్తం హైపో ద్రావకం చల్లుతున్నారు. పోలీసులు మైక్​లో విస్తృతంగా ప్రచారం చేపట్టారు. మంగళగిరి రెడ్​జోన్​లో ఉన్నందున ఎవరూ బయటకు రావద్దని పోలీసులు హెచ్చరించారు.

తాడికొండ నియోజకవర్గంలోని మేడికొండూరు మండలం తురకపాలెం రెడ్​జోన్​గా ప్రకటించారు. గ్రామానికి చెందిన ఒకరికి కరోనా పాజిటివ్​ అని తేలడంపై.. అధికారులు ముందు జాగ్రత్తలు తీసుకున్నారు. గ్రామంలో బ్లీచింగ్ చల్లారు. ఇళ్ల నుంచి ఎవరూ బయటకు రావొద్దని హెచ్చరికలు జారీ చేశారు.

వీటితో పాటు.. అచ్చంపేట, క్రోసూరులను రెడ్‌జోన్లుగా అధికారులు ప్రకటించారు.

ఇదీ చూడండి:

కరోనా నియంత్రణకు ప్రభుత్వ చర్యలేంటి?

Last Updated : Apr 2, 2020, 3:57 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.