ETV Bharat / state

ఇద్దరు ఏజెంట్లకు కరోనా... మూడు రోజులపాటు గుంటూరు మిర్చి యార్డ్ బంద్

author img

By

Published : Jun 25, 2020, 6:41 PM IST

గుంటూరు పట్టణంలోని మిర్చి యార్డు లావాదేవీలను మూడు రోజులపాటు నిలిపివేస్తున్నట్లు మార్కెట్ యజామాన్యం తెలిపింది. యార్డులోని ఇద్దరు ఏజెంట్లకు కరోనా సోకిన కారణంగా... ఈ నిర్ణయం తీసుకున్నామని నిర్వాహకులు తెలిపారు.

guntur chilli yard bandh for three days
మూడురోజులపాటు గుంటూరు మిర్చి యార్డ్ బంద్

గుంటూరు పట్టణంలోని మిర్చి యార్డు లావాదేవీలను జూన్ 26 శుక్రవారం నుంచి మూడురోజులపాటు నిలిపివేస్తున్నట్లు మార్కెట్ యజామాన్యం తెలిపింది. మార్కెట్లోని ఇద్దరు కమిషన్ ఏజెంట్లకు వైరస్ సోకిన కారణంగా.. రైతులు, వ్యాపారస్తుల శ్రేయస్సును దృష్టిలో పెట్ట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని మిర్చియార్డ్ ఛైర్మెన్ చంద్రగిరి ఏసురత్నం చెప్పారు.

శని, ఆదివారాలు జనరల్ సెలవుల అనంతరం తిరిగి సోమవారం మిర్చి యార్డ్ లావాదేవీలను ప్రారంభిస్తామని ఆయన వివరించారు. ఈ నిర్ణయంతో.. రానున్న మూడు రోజులు పాటు మిర్చియార్డు మూతపడనుంది.

గుంటూరు పట్టణంలోని మిర్చి యార్డు లావాదేవీలను జూన్ 26 శుక్రవారం నుంచి మూడురోజులపాటు నిలిపివేస్తున్నట్లు మార్కెట్ యజామాన్యం తెలిపింది. మార్కెట్లోని ఇద్దరు కమిషన్ ఏజెంట్లకు వైరస్ సోకిన కారణంగా.. రైతులు, వ్యాపారస్తుల శ్రేయస్సును దృష్టిలో పెట్ట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని మిర్చియార్డ్ ఛైర్మెన్ చంద్రగిరి ఏసురత్నం చెప్పారు.

శని, ఆదివారాలు జనరల్ సెలవుల అనంతరం తిరిగి సోమవారం మిర్చి యార్డ్ లావాదేవీలను ప్రారంభిస్తామని ఆయన వివరించారు. ఈ నిర్ణయంతో.. రానున్న మూడు రోజులు పాటు మిర్చియార్డు మూతపడనుంది.

ఇదీ చూడండి:

'అచ్చెన్నాయుడిని జైల్లో పెట్టి పైశాచిక ఆనందం పొందాలనుకుంటున్నారు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.