ETV Bharat / state

Guntur: 'మధురాన్నం సొసైటీ' ఆధ్వర్యంలో.. రేపటినుంచి అన్నదానం

ఈనెల 4వ తేదీ నుంచి మధురాన్నం సొసైటీ ఆధ్వర్యంలో గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో అన్నదాన కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ మేరకు జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభావతి తెలిపారు.

author img

By

Published : Jul 3, 2021, 8:18 PM IST

Madhurannam Society
మధురాన్నం సొసైటీ

గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఈనెల 4వ తేదీ నుంచి మధురాన్నం సొసైటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభావతి తెలిపారు. ప్రారంభోత్సవానికి ముఖ్య అతిధిగా ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణరెడ్డి, మంత్రి చెరుకువాడ శ్రీ రంగనాధ రాజు హాజరవుతారన్నారు.

ప్రస్తుతం భోజనం కోసం రోగుల సహాయార్ధం వచ్చిన వారు అనేక అవస్థలు పడుతున్నారు. సమస్యను గమనించిన రాష్ట్ర గృహనిర్మాణశాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు వ్యవస్థాపకుడిగా, వారి కుటుంబీకులే సభ్యులుగా ఉన్న మధురాన్నం ట్రస్టు ఆసుపత్రిలో అన్నదానం చేసేందుకు చొరవ తీసుకున్నారు.

గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఈనెల 4వ తేదీ నుంచి మధురాన్నం సొసైటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభావతి తెలిపారు. ప్రారంభోత్సవానికి ముఖ్య అతిధిగా ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణరెడ్డి, మంత్రి చెరుకువాడ శ్రీ రంగనాధ రాజు హాజరవుతారన్నారు.

ప్రస్తుతం భోజనం కోసం రోగుల సహాయార్ధం వచ్చిన వారు అనేక అవస్థలు పడుతున్నారు. సమస్యను గమనించిన రాష్ట్ర గృహనిర్మాణశాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు వ్యవస్థాపకుడిగా, వారి కుటుంబీకులే సభ్యులుగా ఉన్న మధురాన్నం ట్రస్టు ఆసుపత్రిలో అన్నదానం చేసేందుకు చొరవ తీసుకున్నారు.

ఇదీ చదవండి:

MLA Gopireddy: 'రెవెన్యూ అధికారుల వైఖరితో రైతులకు ఇబ్బందులు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.