ETV Bharat / state

'పశుగ్రాస ఉత్పత్తి పెంపకానికి ప్రభుత్వం ప్రోత్సాహం'

author img

By

Published : Jun 12, 2021, 12:38 PM IST

వేసవి కాలంలో పశువులకు సరైన మేత దొరక్క పాల ఉత్పత్తి తగ్గిపోతున్న తీరు.. దూడల ఎదుగుదల దెబ్బతినడానికి దారితీస్తోంది. వేసవి సమయంలో కూడా పశువులకు బలమైన ఆహారాన్ని అందించడానికి.. పచ్చగడ్డి దొరకని సమయంలో రైతన్నలు ప్రత్యామ్నాయంగా పశుగ్రాసాన్ని ఉత్పత్తి చేసి పశువులకు ఆహారంగా అందిస్తున్నారు. దీనిలో భాగంగా పసుగ్రాసం ఆవశ్యకత, వాటి అభివృద్ధికి ప్రభుత్వం ఎటువంటి ప్రోత్సాహలు అందిస్తుంది అన్న వివరాలను.. గుంటూరు జిల్లా కొల్లూరు పశు వైద్యశాల వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ డాక్టర్.రాజేంద్రప్రసాద్ తెలియజేశారు.

animal fodder production scheme
పశుగ్రాస ఉత్పత్తి పెంపకానికి ప్రభుత్వ ప్రోత్సాహం

ప్రభుత్వం నూతనంగా మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా బహువార్షిక పశుగ్రాసాల సాగు చేసుకునే అవకాశాన్ని రైతన్నలకు కల్పించింది. ఈ పథకం ద్వారా అర్హులైన రైతులకు రెండు సంవత్సరాలకు ప్రభుత్వం నుంచి రూ.83,654 ప్రోత్సాహకాన్ని ప్రభుత్వం కల్పించనుంది. మొదటి సంవత్సరం ఖర్చు కింద రూ.51,301, రెండవ ఏడాదికి రూ.32,353 అందుబాటులోకి తెచ్చింది.

ఈ పథకానికి సొంత భూమి ఉన్నవారితో పాటు కౌలు రైతులు కూడా అర్హులని ప్రభుత్వం తెలిపింది. ఒక్కొక్క రైతుకు 0.25 ఎకరాల నుంచి 2.5 ఎకరాల వరకు సాగు చేసుకునే అవకాశాన్ని కల్పించింది. అదే క్రమంలో రైతులు సమూహంగా ఏర్పడి 5 ఎకరాల వరకూ అర్హత పొందే అవకాశాన్ని కల్పించింది. ఉపాధి హామీ పథకం మీద ఎకరాకు కూలీలకు రూ.45,030.. మెటీరియల్ కాంపౌండ్ కింద రూ. 38,624 చెల్లించనుంది.

పథకానికి కావలసిన పత్రాలు..

ఈ పథకం కింద అర్హత పొందడానికి రైతన్నలకు అవసరమైన పత్రాలు గ్రామసభల తీర్మానం, మండల తీర్మానం, ఉపాధిహామీ జాబ్ కార్డు, బ్యాంకు పాస్ బుక్, ఆధార్ కార్డు, రేషన్ కార్డు జిరాక్స్​లను వారికి దగ్గరలోని పశువైద్య అధికారులను లేదా దగ్గర్లోని రైతు భరోసా కేంద్రానికి వెళ్లి సమర్పించాలి. అక్కడి అధికారులు అర్హులను ఎంపిక చేస్తారని గుంటూరు జిల్లా కొల్లూరు పశు వైద్యశాల వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ డాక్టర్.రాజేంద్రప్రసాద్ తెలిపారు. మరిన్ని వివరాల కోసం దగ్గరలోని పశు వైద్యశాలను లేదా రైతు భరోసా కేంద్రాలను సంప్రదించాలని సూచించారు.

ప్రభుత్వం నూతనంగా మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా బహువార్షిక పశుగ్రాసాల సాగు చేసుకునే అవకాశాన్ని రైతన్నలకు కల్పించింది. ఈ పథకం ద్వారా అర్హులైన రైతులకు రెండు సంవత్సరాలకు ప్రభుత్వం నుంచి రూ.83,654 ప్రోత్సాహకాన్ని ప్రభుత్వం కల్పించనుంది. మొదటి సంవత్సరం ఖర్చు కింద రూ.51,301, రెండవ ఏడాదికి రూ.32,353 అందుబాటులోకి తెచ్చింది.

ఈ పథకానికి సొంత భూమి ఉన్నవారితో పాటు కౌలు రైతులు కూడా అర్హులని ప్రభుత్వం తెలిపింది. ఒక్కొక్క రైతుకు 0.25 ఎకరాల నుంచి 2.5 ఎకరాల వరకు సాగు చేసుకునే అవకాశాన్ని కల్పించింది. అదే క్రమంలో రైతులు సమూహంగా ఏర్పడి 5 ఎకరాల వరకూ అర్హత పొందే అవకాశాన్ని కల్పించింది. ఉపాధి హామీ పథకం మీద ఎకరాకు కూలీలకు రూ.45,030.. మెటీరియల్ కాంపౌండ్ కింద రూ. 38,624 చెల్లించనుంది.

పథకానికి కావలసిన పత్రాలు..

ఈ పథకం కింద అర్హత పొందడానికి రైతన్నలకు అవసరమైన పత్రాలు గ్రామసభల తీర్మానం, మండల తీర్మానం, ఉపాధిహామీ జాబ్ కార్డు, బ్యాంకు పాస్ బుక్, ఆధార్ కార్డు, రేషన్ కార్డు జిరాక్స్​లను వారికి దగ్గరలోని పశువైద్య అధికారులను లేదా దగ్గర్లోని రైతు భరోసా కేంద్రానికి వెళ్లి సమర్పించాలి. అక్కడి అధికారులు అర్హులను ఎంపిక చేస్తారని గుంటూరు జిల్లా కొల్లూరు పశు వైద్యశాల వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ డాక్టర్.రాజేంద్రప్రసాద్ తెలిపారు. మరిన్ని వివరాల కోసం దగ్గరలోని పశు వైద్యశాలను లేదా రైతు భరోసా కేంద్రాలను సంప్రదించాలని సూచించారు.

ఇవీ చదవండి:

పంజాబ్ ఎన్నికల కోసం అకాలీదళ్- బీఎస్పీ పొత్తు

ఖరీఫ్​కు సిద్ధమవుతున్న రైతులు... జోరుగా విత్తన కొనుగోళ్లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.