గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్గా చల్లా అనురాధ బాధ్యతలు స్వీకరించారు. నగరంలో పారిశుద్ధ్యం మెరుగుపరచడంపై ప్రత్యేక దృష్టి సారిస్తామని అన్నారు. తాగునీటి సమస్య ఉన్న ప్రాంతాల్లో ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. రహదారుల మరమ్మతులతో పాటు పట్టణ సుందరీకరణపై కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రజలకు మెరుగైన సేవలందేలా కృషి చేస్తానని స్పష్టం చేశారు.
ఇదీ చూడండి: