thumbnail

LIVE: ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి మహోత్సవాలు ప్రత్యక్ష ప్రసారం - Indrakeeladri Sharan Navaratri

By ETV Bharat Andhra Pradesh Team

Published : 2 hours ago

Indrakeeladri Sharan Navaratri celebrations Live : విజయవాడ దుర్గగుడిలో దసరా ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. శరన్నవరాత్రి ఉత్సవాల్లో మూడో రోజు శనివారం అన్నపూర్ణాదేవిగా దుర్గమ్మ దర్శనమిచ్చింది. శనివారం ఉదయం నుంచి భక్తులు భారీగా తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. తెల్లవారుజామున 4 గంటల నుంచి రద్దీ కొనసాగింది. రాత్రి 11 గంటల వరకూ సుమారు 80 వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. మూడు రోజుల్లో రెండు లక్షల మందికి పైగా భక్తులు తరలివచ్చారు. నిత్యం సాయంత్రం వేళ మహానివేదన, పంచహారతులు, చతుర్వేద స్వస్తి నిర్వహిస్తున్నారు. ఇందుకు సాయంత్రం 6.30 నుంచి 7.30 గంటల వరకూ దర్శనాలను ఆపుతున్నారు. అందుకే సాయంత్రం నుంచి క్యూలైన్లలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటోంది. నేడు ఆదివారం కావడంతో దుర్గగుడికి భారీగా భక్తులు తరలిరానున్నారు. రోజూ సాయంత్రం దుర్గాఘాట్‌లో నిర్వహిస్తున్న నదీ హారతి, కనకదుర్గానగర్‌ నుంచి ఆరంభమవుతున్న నగరోత్సవం కనులపండువలా సాగుతున్నాయి.నేడు శ్రీలలితా త్రిపురసుందరీదేవి దర్శనం : దసరా ఉత్సవాల్లో భాగంగా నాలుగో రోజు ఆదివారం కనకదుర్గమ్మ లలితా త్రిపుర సుందరీదేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు.దర్శన సమయాలు: వేకువన 4 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి మహోత్సవాలు - లలితా త్రిపుర సుందరీదేవి రూపంలో అమ్మవారి దర్శనం - ప్రత్యక్ష ప్రసారం.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.