అయ్యప్పమాల, భవానీమాల, శివమాల తరహాలోనే అమరావతి కండువా ధారణ పేరుతో దీక్షలు నిర్వహిస్తున్నామని రాజధాని ఐక్య కార్యాచరణ సమితి కన్వీనర్ పువ్వాడ సుధాకర్ చెప్పారు. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కృష్ణాయపాలెంలో రాజధాని ఐకాస ఆధ్వర్యంలో రైతులు అమరావతి దీక్షాధారణ కార్యక్రమం నిర్వహించారు. ఐదుగురు రైతులు ఈ దీక్ష తీసుకున్నారు. అనంతరం ఐకాస నేతలు రాజధాని ఉద్యమానికి శాయశక్తులా కృషి చేస్తామని రైతులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ దీక్షలు 300వ రోజు వరకు కొనసాగుతాయని సుధాకర్ వెల్లడించారు. దీక్ష చేసినన్ని రోజులూ రైతులు నియమ నిబంధనలతో ఉంటారని చెప్పారు. ఇదీ చూడండి.
కృష్ణాయపాలెంలో రైతుల అమరావతి దీక్షాధారణ
గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కృష్ణాయపాలెంలో రాజధాని ఐకాస ఆధ్వర్యంలో రైతులు అమరావతి దీక్షాధారణ కార్యక్రమం నిర్వహించారు.
అయ్యప్పమాల, భవానీమాల, శివమాల తరహాలోనే అమరావతి కండువా ధారణ పేరుతో దీక్షలు నిర్వహిస్తున్నామని రాజధాని ఐక్య కార్యాచరణ సమితి కన్వీనర్ పువ్వాడ సుధాకర్ చెప్పారు. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కృష్ణాయపాలెంలో రాజధాని ఐకాస ఆధ్వర్యంలో రైతులు అమరావతి దీక్షాధారణ కార్యక్రమం నిర్వహించారు. ఐదుగురు రైతులు ఈ దీక్ష తీసుకున్నారు. అనంతరం ఐకాస నేతలు రాజధాని ఉద్యమానికి శాయశక్తులా కృషి చేస్తామని రైతులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ దీక్షలు 300వ రోజు వరకు కొనసాగుతాయని సుధాకర్ వెల్లడించారు. దీక్ష చేసినన్ని రోజులూ రైతులు నియమ నిబంధనలతో ఉంటారని చెప్పారు. ఇదీ చూడండి.