సార్వత్రిక ఎన్నికల్లో సమర్థవంతంగా విధులు నిర్వహించిన పోలీస్ సిబ్బందిని అభినందించడానికి గుంటూరు పెరేడ్ గ్రౌండ్స్ లో విజయోత్సవ సభను ఏర్పాటు చేశారు. ఐజీ రాజీవ్ కుమార్ మీనా, జిల్లా గ్రామీణ ఎస్పీ రాజశేఖర్ బాబు ముఖ్య అతిథులుగా హాజరయ్యి... ఎన్నికల్లో పకడ్బందీగా విధులు నిర్వహించిన పోలీస్ సిబ్బందికి మెమొంటోలు అందజేశారు. గుంటూరు జిల్లా సమస్యాత్మక ప్రాంతమని.. ఇక్కడ సిబ్బంది తక్కువ ఉన్నా విధులు నిర్వహించడంలో చక్కని ప్రతిభ కనబరిచారని ఐజీ మీనా వెల్లడించారు. జిల్లాలో గతంతో పోల్చుకుంటే ఈ ఎన్నికల్లో పోలింగ్ శాతం పెరిగిందని... గ్రామీణ ఎస్పీ రాజశేఖర్ బాబు అన్నారు.
ఇవి చదవండి....విధి వంచించింది... 'మీరా' ఆదరించింది