అమెరికాలోని మిచిగాన్ రాష్ట్ర సెనెట్ హౌస్.. దీపావళి పండుగకు అధికారిక గుర్తింపు ఇచ్చిందని గుంటూరు జిల్లా తెనాలికి చెందిన ప్రవాస భారతీయురాలు జహనాబేగం తెలిపారు. సెనెటర్ జిమ్ రన్ స్టడ్ తీర్మాన్నాన్ని ప్రతిపాదించగా.. మరో సెనెటర్ డేటా పోల్ హంకి మద్దతు తెలిపారు. మంగళవారం సాయంత్రం సెనెట్ హౌస్ ఆ తీర్మాన్నాన్ని ఆమోదించిందని ఆమె తెలిపారు. ఈ సందర్భంగా తనతో పాటు మరికొందరు ప్రవాస భారతీయులను స్టేట్ క్యాపిటల్ భవన్ కు ఆహ్వానించారని పేర్కొన్నారు. పండుగలు కుల మతాలకు అతీతమని.. అందరూ కలసిమెలసి ఉండాలన్న సందేశాన్నితెలియజేశారు.
ఇదీ చదవండి: