ETV Bharat / state

మాయదారి రోగం.. రిక్షాలో కరోనా మృతదేహం!

author img

By

Published : Aug 12, 2020, 7:19 PM IST

మహమ్మారి వైరస్‌ కర్కశత్వానికి దర్పణంగా నిలుస్తున్నాయి కొన్ని ఘటనలు. మాయదారి కరోనా ధాటికి అయినవారు కళ్లెదుటే కట్టెలుగా మారుతుంటే చూసి తట్టుకోలేని గుండెలు పగులుతున్నాయి. ఓ వ్యక్తి కరోనాతో మరణిస్తే.. అధికారులు ప్రవర్తించిన తీరు విమర్శలకు తావిచ్చింది.

corona dead body evacuation in rickshaw at guntoor
corona dead body evacuation in rickshaw at guntoor

గుంటూరు జిల్లా బాపట్లలో కొవిడ్ మృతుడి పట్ల అధికారులు వ్యవహరించిన తీరు విమర్శలకు దారితీసింది. కరోనాతో బాపట్ల ఆసుపత్రిలో ఓ వృద్ధుడు చనిపోయాడు. అతడి మృతదేహాన్ని మున్సిపల్ సిబ్బంది రిక్షాలో తరలించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఆ మృతదేహానికి కనీసం కొవిడ్ నిబంధనల ప్రకారం.. ప్యాక్ చేయకుండా పాలిథిన్ కవర్లో చుట్టి తీసుకెళ్లారు. మృతదేహం తీసుకెళ్తున్న సమయంలో ఎవరో ఫొటో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. ఈ విషయం ఉపసభాపతి కోన రఘుపతికి దృష్టికి వెళ్లింది. ఆయన అధికారులకు ఫోన్ చేసి ఆగ్రహం వ్యక్తం చేశారు.

వృద్ధుడి స్వస్థలం ప్రకాశం జిల్లా చీరాల అని అధికారులు తెలిపారు. గుండె నొప్పి రావడంతో బాపట్ల ఆసుపత్రికి తీసుకువచ్చారు. ఆయన మరణించిన తర్వాత కరోనా పరీక్ష నిర్వహించగా పాజిటివ్ అని తేలింది. ఆసుపత్రి అధికారులు, పోలీసుల సమాచారం మేరకు మున్సిపల్ అధికారులు మృతదేహాన్ని.. రిక్షాలో తరలించారు.

గుంటూరు జిల్లా బాపట్లలో కొవిడ్ మృతుడి పట్ల అధికారులు వ్యవహరించిన తీరు విమర్శలకు దారితీసింది. కరోనాతో బాపట్ల ఆసుపత్రిలో ఓ వృద్ధుడు చనిపోయాడు. అతడి మృతదేహాన్ని మున్సిపల్ సిబ్బంది రిక్షాలో తరలించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఆ మృతదేహానికి కనీసం కొవిడ్ నిబంధనల ప్రకారం.. ప్యాక్ చేయకుండా పాలిథిన్ కవర్లో చుట్టి తీసుకెళ్లారు. మృతదేహం తీసుకెళ్తున్న సమయంలో ఎవరో ఫొటో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. ఈ విషయం ఉపసభాపతి కోన రఘుపతికి దృష్టికి వెళ్లింది. ఆయన అధికారులకు ఫోన్ చేసి ఆగ్రహం వ్యక్తం చేశారు.

వృద్ధుడి స్వస్థలం ప్రకాశం జిల్లా చీరాల అని అధికారులు తెలిపారు. గుండె నొప్పి రావడంతో బాపట్ల ఆసుపత్రికి తీసుకువచ్చారు. ఆయన మరణించిన తర్వాత కరోనా పరీక్ష నిర్వహించగా పాజిటివ్ అని తేలింది. ఆసుపత్రి అధికారులు, పోలీసుల సమాచారం మేరకు మున్సిపల్ అధికారులు మృతదేహాన్ని.. రిక్షాలో తరలించారు.

ఇదీ చదవండి:

శిరోముండనం కేసు.. తీవ్రంగా పరిగణించిన రాష్ట్రపతి కార్యాలయం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.