గుంటూరు జిల్లా రేపల్లె మండలం నల్లూరిపాలెం గ్రామానికి చెందిన విక్టోరీయా దంపతులు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. తల్లిదండ్రుల నుంచి సంక్రమించిన ఆస్తిని తన సోదరుడు ప్రకాశ్రావు శ్రీనివాస్ అనే కానిస్టేబుల్కు విక్రయించాడని మహిళ వాపోయింది. తాను నివాసం ఉంటున్న గుడిసెను కానిస్టేబుల్ శ్రీనివాస్ తీసేసి తమను బయటకు పంపారని భాదితురాలు తెలిపింది. ఈ విషయంపై నవంబర్ 24న రేపల్లె పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పట్టించుకోలేదని వాపోయింది. తనపై దాడి చేసి స్థలాన్ని ఆక్రమించిన కానిస్టేబుల్పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బాధితురాలు కోరింది.
ఇదీ చూడండి:
ఏఎన్యూ విద్యార్థులపై సస్పెన్షన్ ఎత్తివేత