ETV Bharat / state

తాడువాయిలో గొలుసు దొంగలు హల్ చల్

author img

By

Published : Nov 24, 2020, 6:27 AM IST

గుంటూరు జిల్లా తాడువాయిలో గొలుసు దొంగలు హల్ చల్ చేశారు. రోడ్డుపై నడుచుకుంటూ వెళుతున్న వృద్ధురాలి మెడలో నుంచి మంగళసూత్రాన్ని... ద్విచక్ర వాహనంపై వచ్చిన ఇద్దరు యువకులు లాక్కెళ్లారు. వృద్దురాలు కేకలు వేయగా.. వారిని గ్రామస్థులు పట్టుకోవటానికి ప్రయత్నించారు. వాహనాన్ని వదిలేసిన దుండగులు సమీపంలోని అడవిలోకి పారిపోయారు. పోలీసులు కేసు నమోదు చేశారు.

chain snachers halchal in guntur district
తాడువాయిలో గొలుసు దొంగలు హల్ చల్

గుంటూరు జిల్లా అచ్చంపేట మండలం తాడువాయిలో గొలుసు దొంగలు హల్ చల్ చేశారు. ద్విచక్రవాహనంపై వచ్చిన ఇద్దరు యువకులు... వృద్ధురాలి మెడలో నుంచి మూడు సవర్ల బంగారు పుస్తెలతాడును లాక్కెళ్లారు. వృద్ధురాలు కేకలు వేయడంతో ఇద్దరు యువకుల్ని గ్రామస్థులు వెంటాడారు. ద్విచక్రవాహనాన్ని వదిలిన దుండగులు అడవిలోకి పరారయ్యారు.

ఆ ద్విచక్రవాహనం రిజిస్ట్రేషన్ నంబరు ప్లేటు రెండువైపులా విరిగిపోయి ఉంది. ఇంజిన్, ఛాసిస్ నంబర్ ఆధారంగా అమరావతి మండలం జూపూడికి చెందిన ద్విచక్రవాహనంగా పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. ఆగంతుకులు వినియోగించిన ద్విచక్రవాహనం సొంతమేనా? ఎవరిదైనా దొంగిలించారా అనే కోణంలోనూ పోలీసులు విచారణ చేస్తున్నారు.

గుంటూరు జిల్లా అచ్చంపేట మండలం తాడువాయిలో గొలుసు దొంగలు హల్ చల్ చేశారు. ద్విచక్రవాహనంపై వచ్చిన ఇద్దరు యువకులు... వృద్ధురాలి మెడలో నుంచి మూడు సవర్ల బంగారు పుస్తెలతాడును లాక్కెళ్లారు. వృద్ధురాలు కేకలు వేయడంతో ఇద్దరు యువకుల్ని గ్రామస్థులు వెంటాడారు. ద్విచక్రవాహనాన్ని వదిలిన దుండగులు అడవిలోకి పరారయ్యారు.

ఆ ద్విచక్రవాహనం రిజిస్ట్రేషన్ నంబరు ప్లేటు రెండువైపులా విరిగిపోయి ఉంది. ఇంజిన్, ఛాసిస్ నంబర్ ఆధారంగా అమరావతి మండలం జూపూడికి చెందిన ద్విచక్రవాహనంగా పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. ఆగంతుకులు వినియోగించిన ద్విచక్రవాహనం సొంతమేనా? ఎవరిదైనా దొంగిలించారా అనే కోణంలోనూ పోలీసులు విచారణ చేస్తున్నారు.

ఇదీ చదవండి:

'దేశం సుదీర్ఘ అనుభవం గల రాజకీయ నేతను కోల్పోయింది'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.