ETV Bharat / state

వైకాపా, తెదేపా అవినీతి, కుంభకోణాలకు చిరునామా: రావెల కిషోర్ బాబు

author img

By

Published : Jul 3, 2020, 5:54 PM IST

వైకాపా, తెదేపా పార్టీలు అవినీతి, కుంభకోణాలకు చిరునామాగా మారాయని భాజపా నాయకులు రావెల కిషోర్ బాబు విమర్శించారు. మోదీ విధివిధానాలు నచ్చి... వందలాది మంది భాజపాలో చేరుతున్నారని ఆయన అన్నారు.

bjp leader ravela kishore babu fires on ycp and tdp
వైకాపా, తెదేపాలపై మండిపడ్డ రాపెల కిషోర్ బాబు

రాష్ట్రంలో వైకాపా, తెదేపా పార్టీలు అవినీతి, కుంభకోణాలకు చిరునామాగా మారాయని భాజపా నాయకులు రావెల కిషోర్ బాబు విమర్శించారు. గుంటూరులో పలువురు వ్యాపారవేత్తలను భాజపా కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. దేశవ్యాప్తంగా భాజపాకు పెద్ద ఎత్తున ఆదరణ పెరుగుతుందన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చిన తరువాత దేశ ప్రతిష్టలు ప్రపంచ స్థాయికి చేరుకున్నాయన్నారు.

రాష్ట్రంలో వివిధ పార్టీల కార్యకర్తలు, నాయకులు భాజపా తీర్థం పుచ్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. మోదీ విధి విధానాలు నచ్చి... వందలాది మంది పార్టీలో చేరుతున్నారన్నారు. రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీలకు మద్దతు తగ్గిపోతుందని... భాజపాకు మద్దతు పెరుగుతుందన్నారు.

రాష్ట్రంలో వైకాపా, తెదేపా పార్టీలు అవినీతి, కుంభకోణాలకు చిరునామాగా మారాయని భాజపా నాయకులు రావెల కిషోర్ బాబు విమర్శించారు. గుంటూరులో పలువురు వ్యాపారవేత్తలను భాజపా కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. దేశవ్యాప్తంగా భాజపాకు పెద్ద ఎత్తున ఆదరణ పెరుగుతుందన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చిన తరువాత దేశ ప్రతిష్టలు ప్రపంచ స్థాయికి చేరుకున్నాయన్నారు.

రాష్ట్రంలో వివిధ పార్టీల కార్యకర్తలు, నాయకులు భాజపా తీర్థం పుచ్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. మోదీ విధి విధానాలు నచ్చి... వందలాది మంది పార్టీలో చేరుతున్నారన్నారు. రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీలకు మద్దతు తగ్గిపోతుందని... భాజపాకు మద్దతు పెరుగుతుందన్నారు.

ఇదీ చదవండి:

వైకాపాలో వర్గ పోరు..అర్ధరాత్రి ఇరువర్గాల మధ్య తోపులాట

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.