ETV Bharat / state

హైదరాబాద్​లో​ రూ.4 కోట్ల హవాలా డబ్బు పట్టివేత.. ముగ్గురు అరెస్టు

RS 4 Crore Hawala Money Seized: తెలంగాణలోని హైదరాబాద్​ మహానగరంలో అక్రమ తరలింపులకు అడ్డాగా నిలుస్తోంది. ప్రతిసారి ఏదో ఒక దొంగతనాలు, స్మగ్లింగ్​, హత్యలు, అక్రమ తరలింపులతో వార్తల్లో చేరుతోంది. అయితే తాజాగా ఏకంగా రూ.4 కోట్ల హవాలా డబ్బును కారులో తరలిస్తూ.. అడ్డంగా దొరికిపోయారు కొంతమంది.

author img

By

Published : Jan 24, 2023, 3:35 PM IST

RS 4 Crore Hawala Money Seized
RS 4 Crore Hawala Money Seized

Begumpet Police Seized RS 4 Crore Hawala Money: తెలంగాణలోని హైదరాబాద్​ మహానగరంలో హవాలా రాకెట్​కు అడ్డుకట్ట వేసే వారే లేకుండా పోతుంది. మొన్నటివరకు డ్రగ్స్​ స్మగ్లింగ్​.. నేడు హవాలా మనీ అక్రమ రవాణా.. ఇలా రోజుకొకటి వార్తలో నిలుస్తుంది. తాజాగా రెండు కార్లలో తరలిస్తున్న రూ.4 కోట్ల నగదును హైదరాబాద్‌లోని బేగంపేట పోలీసులు పట్టుకున్నారు. ఈ సందర్భంగా ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.

సోమవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో గ్రీన్‌ల్యాండ్స్‌ వైపు నుంచి ప్యారడైజ్‌ వైపు వెళ్తున్న రెండు కార్లను ప్రకాశ్‌నగర్‌ సమీపంలోని బ్రిడ్జి వద్ద బేగంపేట పోలీసులు అడ్డుకున్నారు. రెండు కార్లను తనిఖీచేసి రూ.4 కోట్ల నగదును గుర్తించారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు, ప్రశాంత్‌, విపులచౌదరి అనే ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. తాము రుతుప్రియ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కు చెందిన వారమని వారు వెల్లడించారు.

సుమారు 3 గంటల పాటు కొనసాగిన విచారణలో నగదుకు సంబంధించి ఎలాంటి ఆధారాలు చూపలేదు. నగదుతోపాటు, ముగ్గురిని ఆదాయపు పన్ను శాఖ అధికారులకు అప్పగించినట్లు బేగంపేట ఇన్‌స్పెక్టర్‌ పి.శ్రీనివాస్‌రావు తెలిపారు. వారికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. దీన్ని హవాలా సొమ్ముగా అనుమానిస్తున్నామన్నారు.

ఇవీ చదవండి:

Begumpet Police Seized RS 4 Crore Hawala Money: తెలంగాణలోని హైదరాబాద్​ మహానగరంలో హవాలా రాకెట్​కు అడ్డుకట్ట వేసే వారే లేకుండా పోతుంది. మొన్నటివరకు డ్రగ్స్​ స్మగ్లింగ్​.. నేడు హవాలా మనీ అక్రమ రవాణా.. ఇలా రోజుకొకటి వార్తలో నిలుస్తుంది. తాజాగా రెండు కార్లలో తరలిస్తున్న రూ.4 కోట్ల నగదును హైదరాబాద్‌లోని బేగంపేట పోలీసులు పట్టుకున్నారు. ఈ సందర్భంగా ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.

సోమవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో గ్రీన్‌ల్యాండ్స్‌ వైపు నుంచి ప్యారడైజ్‌ వైపు వెళ్తున్న రెండు కార్లను ప్రకాశ్‌నగర్‌ సమీపంలోని బ్రిడ్జి వద్ద బేగంపేట పోలీసులు అడ్డుకున్నారు. రెండు కార్లను తనిఖీచేసి రూ.4 కోట్ల నగదును గుర్తించారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు, ప్రశాంత్‌, విపులచౌదరి అనే ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. తాము రుతుప్రియ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కు చెందిన వారమని వారు వెల్లడించారు.

సుమారు 3 గంటల పాటు కొనసాగిన విచారణలో నగదుకు సంబంధించి ఎలాంటి ఆధారాలు చూపలేదు. నగదుతోపాటు, ముగ్గురిని ఆదాయపు పన్ను శాఖ అధికారులకు అప్పగించినట్లు బేగంపేట ఇన్‌స్పెక్టర్‌ పి.శ్రీనివాస్‌రావు తెలిపారు. వారికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. దీన్ని హవాలా సొమ్ముగా అనుమానిస్తున్నామన్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.