- తెలంగాణలో ఓట్లు అడిగే హక్కు టీడీపీకే ఉంది :చంద్రబాబు
తెలంగాణలో తెలుగుదేశం పార్టీని క్రియాశీలకంగా చేయాలని తాను కోరుతున్నానన్నారు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు. తెలంగాణలో ఓట్లు అడిగే హక్కు టీడీపీకే ఉందన్నారు. తెలుగుదేశం పార్టీ నుంచి వివిధ పార్టీల్లోకి వెళ్లిన నేతలంతా తిరిగి రావాలని ఖమ్మం సభలో ఆహ్వానించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఆ రాష్ట్ర ప్రభుత్వం జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితికి వచ్చింది: నిర్మలాసీతారామన్
రాష్ట్రాల ఆర్థిక పరిస్థితిపై కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఓ రాష్ట్రం ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితికి చేరిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగులకు వేతనాలు ఇవ్వలేని వాళ్లు కూడా దేశవ్యాప్తంగా ప్రచారానికి మాత్రం విపరీతంగా ఖర్చు చేస్తున్నారన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- వచ్చే ఏడాది నుంచి డిజిటల్ తరగతులు ప్రారంభం: సీఎం జగన్
విద్యారంగం అభివృద్ధిలో భాగంగా జగనన్న అమ్మ ఒడి, విద్యా దీవెన, వసతి దీవెన, విద్యా కానుక, ట్యాబ్ లు, జగనన్న గోరుముద్ద, నాడు-నేడు, వైయస్సార్ సంపూర్ణ పోషణ, స్వేచ్ఛ పథకాల కోసం మొత్తం రూ. 54,910.88 కోట్లు వ్యయం చేసినట్లు సీఎం వివరించారు. ముఖ్యమంత్రి చేపట్టిన విద్యారంగ సంస్కరణలు విప్లవాత్మక మార్పులు తెచ్చాయని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. పిల్లల చదువుల కోసం ఏపీలో చేస్తున్న కార్యక్రమాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని మంత్రి మేరుగునాగార్జున వ్యాఖ్యానించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- వెనుకబడిన తరగతులకు రిజర్వేషన్లు కల్పించే అధికారం రాష్ట్రాలకు ఉంది: కేంద్రం
సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన తరగతులకు రిజర్వేషన్లు కల్పించే అధికారం రాష్ట్రాలకు ఉందని కేంద్ర సామాజిక న్యాయ, సాధికారిత మంత్రిత్వ శాఖ రాజ్యసభలో తెలిపింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- 'చైనా తరహాలో దాడి చేస్తే భారత సైన్యంలా తరిమికొడతాం'.. సీఎం ఫైర్
కర్ణాటక, మహారాష్ట్ర సరిహద్దు వివాదంపై శివసేన(ఠాక్రే) ఎంపీ, కర్ణాటక సీఎం వాగ్బాణాలు సంధించుకున్నారు. చైనా తరహాలో కర్ణాటకలోకి చొచ్చుకెళ్తామంటూ సంజయ్ రౌత్ వ్యాఖ్యానించగా.. తాము భారత సైన్యంలా తరిమికొడతామంటూ కర్ణాటక సీఎం బదులిచ్చారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- గుర్రాలపై వచ్చి కలెక్టర్ ఆఫీసు ముందు పెళ్లికాని ప్రసాదుల వింత నిరసన
మహారాష్ట్రలోని సోలాపూర్ జిల్లాలో యువకులు వింత నిరసన చేశారు. వివాహం చేసుకోవటానికి రాష్ట్రంలో తగిన సంఖ్యలో అమ్మాయిలు పెళ్లికాని యువకులు కొందరు ఆవేదన వ్యక్తం చేశారు. క్రాంతి జ్యోతి పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఆందోళనకు పెళ్లికాని యువకులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. గుర్రాలపై ఊరేగితూ సోలాపూర్ కలెక్టరేట్ ఎదుట బైఠాయించి ఆందోళన చేపట్టారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఉక్రెయిన్కు అండగా అమెరికా.. 'పేక్రియాట్'వ్యవస్థను ఇచ్చేందుకు రెడీ.. రష్యా ఆగ్రహం
ఉక్రెయిన్కు మరోసారి అమెరికా అండగా నిలిచింది. కీవ్కు 'పేట్రియాట్' రక్షణ వ్యవస్థను ఇచ్చేందుకు సిద్ధపడింది. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్-రష్యా మధ్య యుద్ధం మరింత తీవ్రతరమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- హ్యుందాయ్ నుంచి కొత్త ఈవీ.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 631 కి.మీ. వెళ్లేలా..
ప్రముఖ వాహన తయారీ సంస్థ హ్యుందాయ్ తన ఎలక్ట్రిక్ వాహన శ్రేణిలో అయోనిక్5 ఎస్యూవీని విడుదల చేసింది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 631 కి.మీ. ప్రయాణించేలా దీన్ని రూపొందించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- 'మార్టినెజ్.. ఇదేం పని?'.. ఎంబాపె ముఖం ఫొటో తగిలించిన పిల్లాడి బొమ్మను..
ఫిఫా వరల్డ్ కప్ 2022 ఫైనల్లో సూపర్ గోల్స్తో అర్జెంటీనా హీరోగా మారిన ఎమిలియానో మార్టినెజ్ ఇప్పుడు తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాడు. విజయ యాత్రలో భాగంగా తలకు ఎంబాపె ముఖం ఫొటో తగిలించిన చిన్న పిల్లాడి బొమ్మను అతను పట్టుకుని బస్సుపై కనిపించాడు. ఎంబాపె లాంటి అగ్రశ్రేణి ఆటగాణ్ని ఇలా ఎగతాళి చేయడం సరికాదంటూ మార్టినెజ్పై విమర్శలు వస్తున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఓ వైపు MBBS.. మరో వైపు సినిమాలు.. రవితేజకి నేను బిగ్ ఫ్యాన్: శ్రీలీల
కె.రాఘవేంద్రరావు సమర్పణలో వచ్చిన 'పెళ్లిసందడి'తో తెలుగు తెరకు పరిచయమైన శ్రీలీల.. వరుస అవకాశాలతో దూసుకెళుతోంది. తన రెండో చిత్రంలోనే రవితేజతో జట్టు కట్టింది. 'ధమాకా' పేరుతో రూపొందిన ఆ చిత్ర శుక్రవారం ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా ఆమె ముచ్చటించిన విశేషాలు మీకోసం.. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.