ETV Bharat / state

AP debts Problems: అప్పును కప్పిపుచ్చేందుకు ప్రభుత్వం తిప్పలు

author img

By

Published : Oct 21, 2022, 8:00 AM IST

AP debts Problems: కార్పొరేషన్ల ద్వారా విచ్చలవిడిగా చేస్తున్న అప్పులతో మోయలేని విధంగా పెరిగిన రుణభారం బయటపడకుండా ఉండేందుకు ప్రభుత్వం ఆపసోపాలు పడుతోంది. సేకరించిన వాస్తవ అప్పును తెలుసుకునేందుకు కాగ్‌ బృందం ఆడిట్‌కు రావడంతో ఆర్థికశాఖ అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. అప్పుల మొత్తాన్ని కప్పిపుచ్చేందుకు ఇంతే రుణం తెచ్చామని చెప్పాలంటూ ప్రత్యేకంగా నోట్‌ తయారుచేసి రాష్ట్ర ఆర్థికశాఖ అధికారులకు అందజేశారు. అంతకు మించి చెబితే అప్పులు పుట్టలు...జీతాలు రావు... మీఇష్టమంటూ హెచ్చరిస్తున్నారు.

ap debts
రాష్ట్ర ప్రభుత్వానికి అప్పుల తిప్పలు
రాష్ట్ర ప్రభుత్వానికి అప్పుల తిప్పలు

AP debts Problems: రాష్ట్రం తీసుకున్న అప్పులు మొత్తం బయటపడకుండా ప్రభుత్వం తిప్పలు పడుతోంది. కార్పొరేషన్ల పేరుతో లెక్కకు మిక్కిలి అప్పులు తీసుకోవడంతో కాగ్‌ ఉన్నతస్థాయి ఆదేశాల మేరకు ప్రత్యేక ఆడిట్‌కు.. అధికారులు రంగంలోకి దిగారు. సచివాలయంలో ఆర్థిక శాఖ కార్యలయంలోనే నలుగురు అధికారులు ఉండి ఆడిట్‌ కార్యకలాపాలు సాగిస్తున్నారు. తామేదో ప్రత్యేక పనిమీద వచ్చామన్న విషయాన్ని ఎక్కడా చెప్పకుండా తమ పని తాము చేసుకుని వెళ్లిపోతున్నారు. ఈ ఆడిట్‌ నేపథ్యంలో రాష్ట్ర ఆర్థికశాఖ అధికారులు కంగారు పడుతున్నారు.

అంతకుముందు ఆర్థికశాఖ ఉన్నతాధికారులు ప్రిన్సిపల్‌ ఆకౌంటెంట్‌ జనరల్‌ కార్యాలయానికి వెళ్లి రాష్ట్ర అప్పుల లెక్కలపై వారితో ఘర్షణ వైఖరితో వ్యవహరించినట్లు తెలిసింది. రాష్ట్రం ఇచ్చిన లెక్కలను పరిగణనలోకి తీసుకోకుండా అకౌంటెంట్‌ జనరల్‌ కార్యాలయ అధికారులు ఏవో తప్పులు జరుగుతున్నట్లుగా వ్యవహరిస్తున్నారని ఉన్నతస్థాయి నుంచి తామేదో అప్పుల విషయంలో తప్పులు చేసినట్లుగా లేఖలు వస్తున్నాయని తమ గణాంకాలనే పరిగణనలోకి తీసుకోవాలని వాదనకు దిగినట్లు తెలిసింది. ప్రిన్సిపల్‌ అకౌంటెంట్‌ జనరల్‌ కార్యాలయ అధికారులు సదరు రాష్ట్ర అధికారులకు ఘాటుగానే సమాధానం ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.

ఈ నేపథ్యంలో ప్రస్తుత ఆడిట్‌లో అసలు అప్పులు బయటపడితే కష్టమేనని ఆర్థికశాఖ ఉన్నతాధికారులు కంగారు పడుతున్నారు. కార్పొరేషన్ల అప్పులపై ఇప్పటికే ప్రభుత్వం ఓ నోట్‌ సిద్ధం చేసినట్లు సమాచారం. మొత్తం కార్పొరేషన్ల రుణభారం 40వేల కోట్లే ఉందని అంతకుమించి లేదని నమ్మబలికేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అధికారికంగా ఆర్థికశాఖ వెల్లడించే కార్పొరేషన్‌ అప్పుల జాబితానే ఆర్థికశాఖలోని మధ్యస్థాయి అధికారులందరికీ అందజేసి ఎవరేం అడిగినా ఇవే గణాంకాలు చెప్పాలని నిర్దేశించడం విశేషం. ఇప్పటికే అకౌంటెంట్‌ జనరల్‌ కార్యాలయాల్లోనూ, కేంద్ర ఆర్థికశాఖలోనూ ఏపీ అప్పుల విషయంలో అనేక తప్పులు చేస్తోందనే అభిప్రాయం ఉందని, ప్రస్తుత ఆడిట్‌ సమయంలో ఆర్థికశాఖ అధికారులంతా తామిచ్చిన వివరాలనే వారికి వెల్లడించాలని హుకుం జారీ చేసినట్లు సమాచారం. లేకుంటే రాష్ట్రానికి అప్పులూ రావు.. మీకు జీతాలూ రావని ఓ ఉన్నతాధికారి హెచ్చరించినట్లు సమాచారం.

కార్పొరేషన్ల అప్పులపై ప్రత్యేక ఆడిట్‌ నిర్వహించేందుకు వచ్చిన బృందం రెండు నెలల పాటు ఇక్కడే ఉంటుందని సమాచారం. సాధారణ కార్యక్రమమే అయితే రెండు, మూడు రోజుల్లోనే ముగించుకుని వెళ్లేవారని అసలు వాస్తవాలు తేల్చేందుకే రెండు నెలల పాటు తనిఖీలకు సిద్ధమయ్యారనే చర్చ సాగుతోంది. ఆడిట్‌ బృందం.. అన్ని కార్పొరేషన్ల అకౌంటు పుస్తకాలు, బ్యాలెన్స్‌ షీట్‌ వంటివి సమగ్రంగా అధ్యయనం చేస్తేనే కార్పొరేషన్ల అప్పుల వివరాలూ బయటపడతాయి. వివిధ బ్యాంకులు, ఆర్థిక సంస్థలు రాష్ట్రంలో ఏ కార్పొరేషన్‌కు ఎంత రుణం ఇచ్చాయన్న వివరాలనూ వారి నుంచి సేకరించి.. ఈ రెండింటిని పోల్చి చూడాలని వినతులు వినిపిస్తున్నాయి. ఈ అంశంపై ఎంపీ రఘురామకృష్ణరాజు దిల్లీలోని కాగ్‌ గిరీష్‌చంద్ర ముర్ముకు లేఖ రాసినట్లు తెలిసింది.

ఇవీ చదవండి:

రాష్ట్ర ప్రభుత్వానికి అప్పుల తిప్పలు

AP debts Problems: రాష్ట్రం తీసుకున్న అప్పులు మొత్తం బయటపడకుండా ప్రభుత్వం తిప్పలు పడుతోంది. కార్పొరేషన్ల పేరుతో లెక్కకు మిక్కిలి అప్పులు తీసుకోవడంతో కాగ్‌ ఉన్నతస్థాయి ఆదేశాల మేరకు ప్రత్యేక ఆడిట్‌కు.. అధికారులు రంగంలోకి దిగారు. సచివాలయంలో ఆర్థిక శాఖ కార్యలయంలోనే నలుగురు అధికారులు ఉండి ఆడిట్‌ కార్యకలాపాలు సాగిస్తున్నారు. తామేదో ప్రత్యేక పనిమీద వచ్చామన్న విషయాన్ని ఎక్కడా చెప్పకుండా తమ పని తాము చేసుకుని వెళ్లిపోతున్నారు. ఈ ఆడిట్‌ నేపథ్యంలో రాష్ట్ర ఆర్థికశాఖ అధికారులు కంగారు పడుతున్నారు.

అంతకుముందు ఆర్థికశాఖ ఉన్నతాధికారులు ప్రిన్సిపల్‌ ఆకౌంటెంట్‌ జనరల్‌ కార్యాలయానికి వెళ్లి రాష్ట్ర అప్పుల లెక్కలపై వారితో ఘర్షణ వైఖరితో వ్యవహరించినట్లు తెలిసింది. రాష్ట్రం ఇచ్చిన లెక్కలను పరిగణనలోకి తీసుకోకుండా అకౌంటెంట్‌ జనరల్‌ కార్యాలయ అధికారులు ఏవో తప్పులు జరుగుతున్నట్లుగా వ్యవహరిస్తున్నారని ఉన్నతస్థాయి నుంచి తామేదో అప్పుల విషయంలో తప్పులు చేసినట్లుగా లేఖలు వస్తున్నాయని తమ గణాంకాలనే పరిగణనలోకి తీసుకోవాలని వాదనకు దిగినట్లు తెలిసింది. ప్రిన్సిపల్‌ అకౌంటెంట్‌ జనరల్‌ కార్యాలయ అధికారులు సదరు రాష్ట్ర అధికారులకు ఘాటుగానే సమాధానం ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.

ఈ నేపథ్యంలో ప్రస్తుత ఆడిట్‌లో అసలు అప్పులు బయటపడితే కష్టమేనని ఆర్థికశాఖ ఉన్నతాధికారులు కంగారు పడుతున్నారు. కార్పొరేషన్ల అప్పులపై ఇప్పటికే ప్రభుత్వం ఓ నోట్‌ సిద్ధం చేసినట్లు సమాచారం. మొత్తం కార్పొరేషన్ల రుణభారం 40వేల కోట్లే ఉందని అంతకుమించి లేదని నమ్మబలికేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అధికారికంగా ఆర్థికశాఖ వెల్లడించే కార్పొరేషన్‌ అప్పుల జాబితానే ఆర్థికశాఖలోని మధ్యస్థాయి అధికారులందరికీ అందజేసి ఎవరేం అడిగినా ఇవే గణాంకాలు చెప్పాలని నిర్దేశించడం విశేషం. ఇప్పటికే అకౌంటెంట్‌ జనరల్‌ కార్యాలయాల్లోనూ, కేంద్ర ఆర్థికశాఖలోనూ ఏపీ అప్పుల విషయంలో అనేక తప్పులు చేస్తోందనే అభిప్రాయం ఉందని, ప్రస్తుత ఆడిట్‌ సమయంలో ఆర్థికశాఖ అధికారులంతా తామిచ్చిన వివరాలనే వారికి వెల్లడించాలని హుకుం జారీ చేసినట్లు సమాచారం. లేకుంటే రాష్ట్రానికి అప్పులూ రావు.. మీకు జీతాలూ రావని ఓ ఉన్నతాధికారి హెచ్చరించినట్లు సమాచారం.

కార్పొరేషన్ల అప్పులపై ప్రత్యేక ఆడిట్‌ నిర్వహించేందుకు వచ్చిన బృందం రెండు నెలల పాటు ఇక్కడే ఉంటుందని సమాచారం. సాధారణ కార్యక్రమమే అయితే రెండు, మూడు రోజుల్లోనే ముగించుకుని వెళ్లేవారని అసలు వాస్తవాలు తేల్చేందుకే రెండు నెలల పాటు తనిఖీలకు సిద్ధమయ్యారనే చర్చ సాగుతోంది. ఆడిట్‌ బృందం.. అన్ని కార్పొరేషన్ల అకౌంటు పుస్తకాలు, బ్యాలెన్స్‌ షీట్‌ వంటివి సమగ్రంగా అధ్యయనం చేస్తేనే కార్పొరేషన్ల అప్పుల వివరాలూ బయటపడతాయి. వివిధ బ్యాంకులు, ఆర్థిక సంస్థలు రాష్ట్రంలో ఏ కార్పొరేషన్‌కు ఎంత రుణం ఇచ్చాయన్న వివరాలనూ వారి నుంచి సేకరించి.. ఈ రెండింటిని పోల్చి చూడాలని వినతులు వినిపిస్తున్నాయి. ఈ అంశంపై ఎంపీ రఘురామకృష్ణరాజు దిల్లీలోని కాగ్‌ గిరీష్‌చంద్ర ముర్ముకు లేఖ రాసినట్లు తెలిసింది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.