ETV Bharat / state

'కోడెల మృతితో ప్రభుత్వానికి ఏం సంబంధం..?'

author img

By

Published : Sep 17, 2019, 10:33 PM IST

మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు మృతి వ్యవహారంలో ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తూ... ప్రజలను రెచ్చగొట్టేందుకు తెదేపా కుటిల యత్నాలు చేస్తోందని వైకాపా ఎమ్మెల్యే అంబటి రాంబాబు ఆరోపించారు.

అంబటి రాంబాబు
అంబటి రాంబాబు

మాజీ సభాపతి కోడెల శివప్రసాదరావు ఆత్మహత్యపై సీబీఐ విచారణకు తమకు అభ్యంతరం లేదని వైకాపా స్పష్టం చేసింది. సీబీఐ విచారణతో వాస్తవాలు వెలుగులోకి వస్తాయని... సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబు పేర్కొన్నారు. కోడెల ఆత్మహత్య వ్యవహారంలో ప్రభుత్వానికి ఎలాంటి ప్రమేయం లేదని స్పష్టం చేశారు. ఈ వ్యవహారంలో ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తూ... ప్రజలను రెచ్చగొట్టేందుకు తెదేపా కుటిలయత్నాలు చేస్తోందని ఆరోపించారు.

వివాదాస్పద సందర్భాలు సహా... బాంబు పెలుళ్లు వంటి క్లిష్ట పరిస్థితులనూ కోడెల ఎదుర్కొన్నారని గుర్తుచేశారు. శివప్రసాదరావు ఆత్మహత్య చేసుకునే వ్యక్తి కాదన్నారు. తెదేపా అవమానాల కారణంగానే ప్రాణాలు తీసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సత్తెనపల్లిలోనే కోడెలను చంద్రబాబు దారుణంగా అవమానించారని ఆక్షేపించారు. కోడెల చావుకు చంద్రబాబు, ఆయన కుమారుడు, కూతురే కారణమని పేర్కొన్నారు. ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.

ఇదీ చదవండీ... నరసరావుపేటలో 144 సెక్షన్.. భారీగా బలగాల మోహరింపు

అంబటి రాంబాబు

మాజీ సభాపతి కోడెల శివప్రసాదరావు ఆత్మహత్యపై సీబీఐ విచారణకు తమకు అభ్యంతరం లేదని వైకాపా స్పష్టం చేసింది. సీబీఐ విచారణతో వాస్తవాలు వెలుగులోకి వస్తాయని... సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబు పేర్కొన్నారు. కోడెల ఆత్మహత్య వ్యవహారంలో ప్రభుత్వానికి ఎలాంటి ప్రమేయం లేదని స్పష్టం చేశారు. ఈ వ్యవహారంలో ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తూ... ప్రజలను రెచ్చగొట్టేందుకు తెదేపా కుటిలయత్నాలు చేస్తోందని ఆరోపించారు.

వివాదాస్పద సందర్భాలు సహా... బాంబు పెలుళ్లు వంటి క్లిష్ట పరిస్థితులనూ కోడెల ఎదుర్కొన్నారని గుర్తుచేశారు. శివప్రసాదరావు ఆత్మహత్య చేసుకునే వ్యక్తి కాదన్నారు. తెదేపా అవమానాల కారణంగానే ప్రాణాలు తీసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సత్తెనపల్లిలోనే కోడెలను చంద్రబాబు దారుణంగా అవమానించారని ఆక్షేపించారు. కోడెల చావుకు చంద్రబాబు, ఆయన కుమారుడు, కూతురే కారణమని పేర్కొన్నారు. ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.

ఇదీ చదవండీ... నరసరావుపేటలో 144 సెక్షన్.. భారీగా బలగాల మోహరింపు

Intro:ap_gnt_47_17_minister_comments_on_kodel_death_ab_ap1035

చిల్లర రాజకీయాలు చేయడం టీడీపికి వెన్నతో పెట్టిన విద్య అని మంత్రి మోపిదేవి వెంకటరమణరావు విమర్శించారు.
ప్రభుత్వమే కోడెల మరణానికి కారణమంటున్న టిడిపి శ్రేణుల వ్యాఖ్యలను మంత్రి తీవ్రంగా ఖండించారు.
కోడెల శివప్రసాద్ మరణం బాధాకరమని..జిల్లా ఒక సీనియర్ నాయకుడిని కోల్పోయిందని ఆయన అన్నారు .కోడెల మృతిని టీడీపీ వివాదాస్పదం చెయ్యడం మంచిది కాదన్నారు. చనిపోయిన సంఘటనను రాజకీయ కోణంలో మలచి లభ్డి పొందాలని టీడీపీ నాయకులు చూడటం దారుణమని వ్యాఖ్యానించారు. కోడెల పై కొద్దికాలంగా అవినీతి పరమైన అక్రమాలలో పెరు రావడం అందరికి తెలిసిందే అన్నారు. .శివప్రసాద్ మరణానికి అతని కుమారుడే కారణమని...స్వయానా కోడెల మేనల్లుడు తెలిపారన్నారు.దాని పైన విచారణ జరిపించి..వారి కుటుంబానికి అండగా ఉండాల్సింది పోయి ప్రభుత్వం పై బురదచల్లడం బాధాకరమన్నారు. కోడెల కుటుంబానికి వైసీపీ తరపున మంత్రి ప్రగాఢ సానుభూతి తెలిపారు.


Body:బైట్..మోపిదేవి వెంకటరమణ రావు (రాష్ట్ర మంత్రి)


Conclusion:ఈటీవీ కంట్రిబ్యూటర్
మీరా సాహెబ్ 7075757517
రేపల్లె
గుంటూరు జిల్లా
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.