ETV Bharat / state

అమరావతి తహసీల్దార్, పంచాయతీరాజ్ ఈవో సస్పెన్షన్‌

author img

By

Published : Mar 17, 2021, 8:09 PM IST

గుంటూరు జిల్లా అమరావతి తహసీల్దార్, పంచాయతీరాజ్ ఈవో సస్పెండ్​ అయ్యారు. ధరణికోట ఉపసర్పంచ్ ఎన్నికల్లో నిర్లక్ష్యం వహించారంటూ.. కలెక్టర్ వివేక్ యాదవ్ ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు.

amaravthi-thahasiladar-panchayath-raj-eo-suspended
అమరావతి తహసీల్దార్, పంచాయతీరాజ్ ఈవో సస్పెన్షన్

గుంటూరు జిల్లా అమరావతి తహసీల్దార్ ఎ. శ్రీనివాసరావు, పంచాయతీరాజ్ ఈఓ కోయ శ్రీనివాసరావు సస్పెండ్​కు గురయ్యారు. ఈ మేరకు కలెక్టర్ వివేక్ యాదవ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈనెల 15న అమరావతి మండలంలోని ధరణికోట ఉప సర్పంచ్ ఎన్నిక నిర్వహించడంలో నిర్లక్ష్యం వహించారంటూ... తెదేపా వార్డు సభ్యులు రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. వీరిరువురు ఉద్దేశపూర్వకంగా వ్యవహరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఘటనపై స్పందించిన ఈసీ.. విచారణ జరపాలని కలెక్టర్ వివేక్ యాదవ్​ను ఆదేశించింది. విచారణ జరిపిన కలెక్టర్.. ఇద్దరు అధికారులను సస్పెండ్ చేశారు.

గుంటూరు జిల్లా అమరావతి తహసీల్దార్ ఎ. శ్రీనివాసరావు, పంచాయతీరాజ్ ఈఓ కోయ శ్రీనివాసరావు సస్పెండ్​కు గురయ్యారు. ఈ మేరకు కలెక్టర్ వివేక్ యాదవ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈనెల 15న అమరావతి మండలంలోని ధరణికోట ఉప సర్పంచ్ ఎన్నిక నిర్వహించడంలో నిర్లక్ష్యం వహించారంటూ... తెదేపా వార్డు సభ్యులు రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. వీరిరువురు ఉద్దేశపూర్వకంగా వ్యవహరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఘటనపై స్పందించిన ఈసీ.. విచారణ జరపాలని కలెక్టర్ వివేక్ యాదవ్​ను ఆదేశించింది. విచారణ జరిపిన కలెక్టర్.. ఇద్దరు అధికారులను సస్పెండ్ చేశారు.

ఇదీచదవండి.

యానాం అసెంబ్లీ స్థానానికి పుదుచ్చేరి మాజీ సీఎం నామినేషన్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.