ETV Bharat / state

'ఏకైక రాజధానిగా అమరావతిని ప్రకటించే వరకు ఉద్యమం ఆగదు'

author img

By

Published : Jul 26, 2020, 4:24 PM IST

ఏకైక పరిపాలన రాజధానిగా అమరావతిని ప్రకటించే వరకు ఉద్యమం ఆగదని అమరావతి రైతులు స్పష్టం చేశారు. ఉద్యమం 222వ రోజుకు చేరిన సందర్భంగా 29 గ్రామాల్లో దళిత ఐకాస ఆధ్వర్యంలో ఆందోళనలు కొనసాగించారు.

amaravathi  protest
అమరావతి

అమరావతి దీక్షలు 222వ రోజుకు చేరిన సందర్భంగా 29 రాజధాని గ్రామాల్లో నిరసనలు కొనసాగించారు. దళిత ఐకాస ఆధ్వర్యంలో రైతులు, రైతు కూలీలు ఇందులో పాల్గొన్నారు. కరోనా నిబంధనలు పాటిస్తూ ఆందోళన చేపట్టారు. ఐకాస ఆధ్వర్యంలో వెబ్​నార్ నిర్వహించగా.. మహిళలు, రైతులు పాల్గొన్నారు. గీతరచయిత రమణ అమరావతి ఉద్యమంపై ఆలపించిన గీతాలు ఆకట్టుకున్నాయి. సీఆర్డీఏ రద్దు, 3 రాజధానుల బిల్లులను గవర్నర్ తిరస్కరించాలని విజ్ఞప్తి చేశారు. ఏకైక రాజధానిగా అమరావతిని ప్రకటించే వరకు ఉద్యమం ఆగదని స్పష్టం చేశారు.

ఇవీ చదవండి...

అమరావతి దీక్షలు 222వ రోజుకు చేరిన సందర్భంగా 29 రాజధాని గ్రామాల్లో నిరసనలు కొనసాగించారు. దళిత ఐకాస ఆధ్వర్యంలో రైతులు, రైతు కూలీలు ఇందులో పాల్గొన్నారు. కరోనా నిబంధనలు పాటిస్తూ ఆందోళన చేపట్టారు. ఐకాస ఆధ్వర్యంలో వెబ్​నార్ నిర్వహించగా.. మహిళలు, రైతులు పాల్గొన్నారు. గీతరచయిత రమణ అమరావతి ఉద్యమంపై ఆలపించిన గీతాలు ఆకట్టుకున్నాయి. సీఆర్డీఏ రద్దు, 3 రాజధానుల బిల్లులను గవర్నర్ తిరస్కరించాలని విజ్ఞప్తి చేశారు. ఏకైక రాజధానిగా అమరావతిని ప్రకటించే వరకు ఉద్యమం ఆగదని స్పష్టం చేశారు.

ఇవీ చదవండి...

వైఎస్ జగన్ నవరత్నాల రూటు మారింది: తులసిరెడ్డి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.