ETV Bharat / state

'అమరావతి ఉద్యమాన్ని మరింత విస్తృతం చేస్తాం'

author img

By

Published : Sep 25, 2020, 5:15 PM IST

అమరావతి ఉద్యమాన్ని మరింత విస్తృతం చేస్తామని అమరావతి పరిరక్షణ సమితి నాయకులు తెలిపారు. 13 జిల్లాల్లో పర్యటించి ప్రజల మద్దతు కూడగడతామని చెప్పారు.

amaravathi farmers  protest
అమరావతి రైతుల ఉద్యమం

వచ్చే నెల నుంచి అమరావతి ఉద్యమాన్ని నలుదిశలా విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని రాజధాని పరిరక్షణ సమితి నాయకులు తెలిపారు. అమరావతిని సాధించుకునేందుకు న్యాయపోరాటంతో పాటు ప్రజల మద్దతు కోసం 13 జిల్లాల్లో పర్యటిస్తామని చెప్పారు.

పరిపాలన రాజధానిగా అమరావతినే కొనసాగించాలని కోరుతూ రైతులు 283వ రోజు ఆందోళన కొనసాగించారు. వెంకటపాలెం, కృష్ణాయపాలెం, ఎర్రబాలెం, నీరుకొండ, మందడం, వెలగపూడి, రాయపూడి, అబ్బరాజుపాలెం గ్రామాల్లో దీక్షా శిబిరాల వద్ద అన్నదాతలు ఆందోళన చేశారు. బోరుపాలెంలో మహిళలు కళ్లకు గంతలు కట్టుకొని నిరసన తెలిపారు. అమరావతికి మద్దతు ప్రకటించిన ఎంపీ రఘురామకృష్ణరాజు చిత్రపటానికి ఐనవోలులో పాలాభిషేకం చేశారు.

వచ్చే నెల నుంచి అమరావతి ఉద్యమాన్ని నలుదిశలా విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని రాజధాని పరిరక్షణ సమితి నాయకులు తెలిపారు. అమరావతిని సాధించుకునేందుకు న్యాయపోరాటంతో పాటు ప్రజల మద్దతు కోసం 13 జిల్లాల్లో పర్యటిస్తామని చెప్పారు.

పరిపాలన రాజధానిగా అమరావతినే కొనసాగించాలని కోరుతూ రైతులు 283వ రోజు ఆందోళన కొనసాగించారు. వెంకటపాలెం, కృష్ణాయపాలెం, ఎర్రబాలెం, నీరుకొండ, మందడం, వెలగపూడి, రాయపూడి, అబ్బరాజుపాలెం గ్రామాల్లో దీక్షా శిబిరాల వద్ద అన్నదాతలు ఆందోళన చేశారు. బోరుపాలెంలో మహిళలు కళ్లకు గంతలు కట్టుకొని నిరసన తెలిపారు. అమరావతికి మద్దతు ప్రకటించిన ఎంపీ రఘురామకృష్ణరాజు చిత్రపటానికి ఐనవోలులో పాలాభిషేకం చేశారు.

ఇవీ చదవండి..

'సీమ పౌరుషం ఉంటే సీఎం పదవికి జగన్ రాజీనామా చేయాలి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.