ETV Bharat / state

294వ రోజుకి చేరిన అమరావతి రైతుల ఆందోళన

author img

By

Published : Oct 6, 2020, 5:47 PM IST

రోజులు గడుస్తున్నా.. అమరావతి రైతుల ఆందోళనలు ఆగటం లేదు. తమ నిరసనల పట్ల ప్రభుత్వం స్పందించే వరకు.. పోరు ఆగదని అన్నదాతలు స్పష్టం చేశారు.

amaravathi agitation
294వ రోజుకి చేరిన అమరావతి రైతుల ఆందోళన

ఏకైక రాజధానిగా అమరావతే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ.. రాజధాని రైతులు చేస్తున్న దీక్షలు 294వ రోజుకి చేరుకున్నాయి. వెలగపూడి, తుళ్లూరు, మందడం, వెంకటపాలెం, పెదపరిమి మెుదలైన గ్రామాల్లో రైతులు ఆందోళన కొనసాగించారు. అమరావతికి మద్దతుగా నినాదాలు చేశారు.

అమరావతి కోసం దీక్ష చేస్తున్న రైతులను పెయిడ్ ఆర్టిస్టులన్న మంత్రులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తుళ్లూరులలో సుభాష్ చంద్రబోస్ విగ్రహం వద్ద రైతులు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. తమపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ.. తుళ్లూరు పోలీస్ స్టేషన్​ వరకు అన్నదాతలు ర్యాలీ నిర్వహించారు.

ఏకైక రాజధానిగా అమరావతే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ.. రాజధాని రైతులు చేస్తున్న దీక్షలు 294వ రోజుకి చేరుకున్నాయి. వెలగపూడి, తుళ్లూరు, మందడం, వెంకటపాలెం, పెదపరిమి మెుదలైన గ్రామాల్లో రైతులు ఆందోళన కొనసాగించారు. అమరావతికి మద్దతుగా నినాదాలు చేశారు.

అమరావతి కోసం దీక్ష చేస్తున్న రైతులను పెయిడ్ ఆర్టిస్టులన్న మంత్రులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తుళ్లూరులలో సుభాష్ చంద్రబోస్ విగ్రహం వద్ద రైతులు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. తమపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ.. తుళ్లూరు పోలీస్ స్టేషన్​ వరకు అన్నదాతలు ర్యాలీ నిర్వహించారు.

ఇదీ చదవండి: విరాళాలతో నిరుపేదలకు చేయూత: శకలక శంకర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.