ETV Bharat / state

పంచాయతీ ఎన్నికలకు అంతా సిద్దం!

author img

By

Published : Feb 7, 2021, 10:22 PM IST

తొలి విడత పంచాయతీ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. గుంటూరు జిల్లాలో ఎన్నికల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లను చకచకా పూర్తి చేస్తున్నారు.

All arrangements completed for elections
పంచాయతీ ఎన్నికలకు అంతా సిద్దం

గుంటూరు జిల్లా తెనాలి డివిజన్​లో తొలి విడత పంచాయతీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. కాకుమాను మండలంలో 12 గ్రామ పంచాయతీల్లో ఎన్నికల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లను చకచకా చేస్తున్నారు. ఇప్పటికే 118 పోలింగ్ కేంద్రాల వద్ద బారికేడ్లు నిర్మించారు. విద్యుత్తు బల్బులు అమర్చారు. పీవోలకు ఇచ్చే ఎన్నికల సామగ్రిని సిద్ధం చేశారు. స్టేజి 2 అధికారులకు ఇప్పటికే సామగ్రిని అందజేశారు. సోమవారం ఎన్నికల అధికారులకు సామగ్రిని, బ్యాలెట్ బాక్సులు, అట్టలు వస్తువులను అందించే ఏర్పాట్లు చేశారు. తహశీల్దార్ వెంకటేశ్వర్లు, ఎంపీడీఓ హీరాలాల్ ఎన్నికల ఏర్పాట్లు పూర్తి చేయించారు.

గురజాల నియోజకవర్గం రెండో రోజు నామినేషన్ ప్రక్రియ మొదలు మందకొడిగా సాగినా మధ్యాహ్నం నుంచి సజావుగా నామినేషన్లు దాఖలయ్యాయి. ఒకటి రెండు చోట్ల చిన్నపాటి ఆటంకాలు ఏర్పడినా కానీ ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసుల సమక్షంలో ప్రక్రియ పూర్తయింది.

రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో తెదేపాని గెలిపిస్తే నగరంలోని ప్రధాన కాలనీలతో పాటు, చివరి వీధి వరకు అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ తెదేపా ఇన్చార్జ్ కోవెలమూడి రవీంద్ర తెలిపారు. ఆదివారం 43వ డివిజన్​లోని ముత్యాలరెడ్డి నగర్​లో ఇంటి ఇంటికి తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా.... ఇంటింటికీ తిరిగి ప్రత్యేకంగా ప్రచురించిన కరపత్రాలు పంచారు.

ఇదీ చదవండి:

గప్​చుప్.. ముగిసిన తొలిదశ పంచాయతీ ఎన్నికల ప్రచారం

గుంటూరు జిల్లా తెనాలి డివిజన్​లో తొలి విడత పంచాయతీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. కాకుమాను మండలంలో 12 గ్రామ పంచాయతీల్లో ఎన్నికల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లను చకచకా చేస్తున్నారు. ఇప్పటికే 118 పోలింగ్ కేంద్రాల వద్ద బారికేడ్లు నిర్మించారు. విద్యుత్తు బల్బులు అమర్చారు. పీవోలకు ఇచ్చే ఎన్నికల సామగ్రిని సిద్ధం చేశారు. స్టేజి 2 అధికారులకు ఇప్పటికే సామగ్రిని అందజేశారు. సోమవారం ఎన్నికల అధికారులకు సామగ్రిని, బ్యాలెట్ బాక్సులు, అట్టలు వస్తువులను అందించే ఏర్పాట్లు చేశారు. తహశీల్దార్ వెంకటేశ్వర్లు, ఎంపీడీఓ హీరాలాల్ ఎన్నికల ఏర్పాట్లు పూర్తి చేయించారు.

గురజాల నియోజకవర్గం రెండో రోజు నామినేషన్ ప్రక్రియ మొదలు మందకొడిగా సాగినా మధ్యాహ్నం నుంచి సజావుగా నామినేషన్లు దాఖలయ్యాయి. ఒకటి రెండు చోట్ల చిన్నపాటి ఆటంకాలు ఏర్పడినా కానీ ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసుల సమక్షంలో ప్రక్రియ పూర్తయింది.

రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో తెదేపాని గెలిపిస్తే నగరంలోని ప్రధాన కాలనీలతో పాటు, చివరి వీధి వరకు అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ తెదేపా ఇన్చార్జ్ కోవెలమూడి రవీంద్ర తెలిపారు. ఆదివారం 43వ డివిజన్​లోని ముత్యాలరెడ్డి నగర్​లో ఇంటి ఇంటికి తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా.... ఇంటింటికీ తిరిగి ప్రత్యేకంగా ప్రచురించిన కరపత్రాలు పంచారు.

ఇదీ చదవండి:

గప్​చుప్.. ముగిసిన తొలిదశ పంచాయతీ ఎన్నికల ప్రచారం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.