గుంటూరు జిల్లాలో వెంకయ్య అనే వ్యక్తి స్వైన్ ఫ్లూ లక్షణాలతో మృతి చెందాడు. మేడికొండూరు మండలం మందపాడు గ్రామానికి చెందిన వెంకయ్యకు పది రోజుల క్రితం జ్వరం వచ్చింది. స్థానికంగా ఉండే ఆర్ఎంపీ వద్ద మందులు వాడిన ఫలితం లేని కారణంగా... గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. జీజీహెచ్ వైద్యులు వెంకయ్యకు పరీక్షలు నిర్వహించి స్వైన్ ఫ్లూ లక్షణాలు ఉన్నట్లు గుర్తించారు. అందుకు సంబంధించిన చికిత్స అందించారు. చికిత్స పొందుతూ వెంకయ్య మరణించాడు.
ఇదీ చూడండి: