ETV Bharat / state

102 ఏళ్ల వయసులో కరోనాను జయించిన వృద్ధురాలు

author img

By

Published : May 25, 2021, 12:15 PM IST

కరోనా రెండో దశ ఎంతో మంది ప్రాణాలను బలితీసుకుంటోంది. ముఖ్యంగా యువకులే ప్రాణాలు కోల్పోతున్నారు. కానీ 102 ఏళ్ల ఓ వృద్ధురాలు ఈ మహమ్మారిని జయించి స్ఫూర్తిగా నిలిచింది.

The old woman
కరోనాను జయించిన వృద్ధురాలు

102 ఏళ్ల వయసున్న ఓ వృద్ధురాలు కరోనాని జయించి సురక్షితంగా ఇంటికి చేరుకుంది. వైద్యులు సూచనలు పాటిస్తూ ధైర్యంగా ఉంటే కరోనాను సులువుగా జయించవచ్చని ఆమె అంటోంది. గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం సిరిపురం చైతన్య కాలనికి చెందిన పెరిపోగు కృష్టయ్య భార్య అనమ్మ వ్యవసాయ కూలీ పనులు చేసుకుంటూ జీవిస్తోంది. మూడు వారాల క్రితం ఆమెకు, ఆమె కుమారుడు కోటేశ్వరరావుకి కరోనా సోకడంతో గుంటూరులోని ఓ ప్రైవేట్​ అసుపత్రిలో చికిత్స పొందారు. నిన్న ఆమె కరోనా నుంచి కోలుకుని ఇంటికి చేరుకున్నారు.

102 ఏళ్ల వయసున్న ఓ వృద్ధురాలు కరోనాని జయించి సురక్షితంగా ఇంటికి చేరుకుంది. వైద్యులు సూచనలు పాటిస్తూ ధైర్యంగా ఉంటే కరోనాను సులువుగా జయించవచ్చని ఆమె అంటోంది. గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం సిరిపురం చైతన్య కాలనికి చెందిన పెరిపోగు కృష్టయ్య భార్య అనమ్మ వ్యవసాయ కూలీ పనులు చేసుకుంటూ జీవిస్తోంది. మూడు వారాల క్రితం ఆమెకు, ఆమె కుమారుడు కోటేశ్వరరావుకి కరోనా సోకడంతో గుంటూరులోని ఓ ప్రైవేట్​ అసుపత్రిలో చికిత్స పొందారు. నిన్న ఆమె కరోనా నుంచి కోలుకుని ఇంటికి చేరుకున్నారు.

ఇదీ చదవండీ.. చిత్తూరు: క్వారీ గుంతలో మూడు మృతదేహాలు.. ఎవరివి?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.