ETV Bharat / state

శ్మశానాల్లో కట్టె కాలాలంటే.. రూ.5వేలు కట్టాల్సిందే! - charge for cremation in crematoriums in eluru

5000 RUPEES CHARGE FOR CREMATION : రాముడే నా మీద కాలు వేస్తే నేను ఎవరికి మొరపెట్టుకోవాలని కప్ప వాపోయినట్లు.. ప్రభుత్వ సంస్థల తీరుతో ప్రజల పరిస్థితీ అలానే తయారైంది. ఉచితంగా అందాల్సిన సేవలు కూడా.. డబ్బులు చెల్లిస్తే తప్ప అందుబాటులో లేని దుస్థితి నెలకొంది. చివరికి శ్మశానాల్లో దహన సంస్కారాలకు సైతం రుసుము చెల్లించాల్సిన పరిస్థితి దాపురించింది. ఇటీవల ఏలూరు నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశంలో చేసిన తీర్మానంపై విమర్శలు వెల్లువెత్తున్నాయి.

5000 RUPEES CHARGE FOR CREMATION
5000 RUPEES CHARGE FOR CREMATION
author img

By

Published : Dec 23, 2022, 10:36 AM IST

Updated : Dec 23, 2022, 5:42 PM IST

CHAGRE FOR CREMATION : ఏలూరు నగరపాలక సంస్థ పరిధిలోని శ్మశానాల్లో దహన సంస్కారాలకు 5వేల రూపాయల చొప్పున వసూలు చేయాలని పాలకవర్గం నిర్ణయించింది. ఇందులోనే కట్టెలు, డీజిల్, పెట్రోల్ లాంటి ఖర్చులు ఉండనున్నాయి. సర్వసభ్య సమావేశ ఎజెండాలో శవ దహనానికి రుసుము వసూలును 53వ అంశంగా చేర్చారు. పేద, ధనిక అనే సంబంధం లేకుండా... చనిపోయిన వ్యక్తి సంస్కారాలకు కుటుంబసభ్యులకు ఇకపై రుసుము చెల్లించాలి. ఇప్పటిదాకా వివిధ రకాల పౌరసేవలకు డబ్బులు వసూలు చేస్తూ ధనార్జనకు అలవాటు పడిన పట్టణ స్థానిక సంస్థలు.. చివరికి దహన సంస్కారాలకూ రేటు నిర్ణయించాయని స్థానిక నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శవ దహనం కోసం వసూలు చేస్తున్న నగదును కాటికాపరులకు జీతాలు ఇచ్చేందుకు వినియోగిస్తున్నామని అధికారులు చెబుతున్నా.. వాస్తవ పరిస్థితి భిన్నంగా ఉంది.

కొవిడ్‌కు ముందు వరకు అత్యధిక ప్రాంతాల్లో కట్టెల ఖర్చుగా వెయ్యి నుంచి 1500 రూపాయల వరకు అనధికారికంగా వసూలు చేసినట్లు సమాచారం. కొవిడ్ సమయంలో కాటికాపరులు భారీగా వసూళ్లకు పాల్పడుతున్నారన్న ఫిర్యాదులపై దృష్టి సారించిన అధికారులు.. నియంత్రణ చర్యలు తీసుకోకపోగా ధరలు పెంచేశారు. మృతుల దహనానికి రుసుము వసూలు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని.. లేదంటే ఉద్యమిస్తామని అఖిలపక్షాలు హెచ్చరిస్తున్నాయి.

శ్మశానాల్లో కట్టె కాలాలంటే.. రూ.5వేలు కట్టాల్సిందే!

"వంతుల ప్రకారం వారానికి ఒకరి పెట్టారు. మాకు జీతం ఏమి లేదు. కేవలం కస్టమర్స్​ ఇచ్చే వాటితోనే మేము జీవనం గడుపుతున్నాము. కస్టమర్స్​ ఇచ్చే డబ్బులతోనే కట్టెలు, డీజిల్​ లాంటివి తీసుకొస్తాం. ఆ డబ్బుల్లో ఎంతో కొంతో మిగిలితే అవి వాడుకుంటాం తప్ప ప్రభుత్వం నుంచి రూపాయి రాదు. నేను ఇక్కడ 25 సంవత్సరాల నుంచి పని చేస్తున్నా"-పంతం ఏడుకొండలు, కాటికాపరి

ఇవీ చదవండి:

CHAGRE FOR CREMATION : ఏలూరు నగరపాలక సంస్థ పరిధిలోని శ్మశానాల్లో దహన సంస్కారాలకు 5వేల రూపాయల చొప్పున వసూలు చేయాలని పాలకవర్గం నిర్ణయించింది. ఇందులోనే కట్టెలు, డీజిల్, పెట్రోల్ లాంటి ఖర్చులు ఉండనున్నాయి. సర్వసభ్య సమావేశ ఎజెండాలో శవ దహనానికి రుసుము వసూలును 53వ అంశంగా చేర్చారు. పేద, ధనిక అనే సంబంధం లేకుండా... చనిపోయిన వ్యక్తి సంస్కారాలకు కుటుంబసభ్యులకు ఇకపై రుసుము చెల్లించాలి. ఇప్పటిదాకా వివిధ రకాల పౌరసేవలకు డబ్బులు వసూలు చేస్తూ ధనార్జనకు అలవాటు పడిన పట్టణ స్థానిక సంస్థలు.. చివరికి దహన సంస్కారాలకూ రేటు నిర్ణయించాయని స్థానిక నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శవ దహనం కోసం వసూలు చేస్తున్న నగదును కాటికాపరులకు జీతాలు ఇచ్చేందుకు వినియోగిస్తున్నామని అధికారులు చెబుతున్నా.. వాస్తవ పరిస్థితి భిన్నంగా ఉంది.

కొవిడ్‌కు ముందు వరకు అత్యధిక ప్రాంతాల్లో కట్టెల ఖర్చుగా వెయ్యి నుంచి 1500 రూపాయల వరకు అనధికారికంగా వసూలు చేసినట్లు సమాచారం. కొవిడ్ సమయంలో కాటికాపరులు భారీగా వసూళ్లకు పాల్పడుతున్నారన్న ఫిర్యాదులపై దృష్టి సారించిన అధికారులు.. నియంత్రణ చర్యలు తీసుకోకపోగా ధరలు పెంచేశారు. మృతుల దహనానికి రుసుము వసూలు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని.. లేదంటే ఉద్యమిస్తామని అఖిలపక్షాలు హెచ్చరిస్తున్నాయి.

శ్మశానాల్లో కట్టె కాలాలంటే.. రూ.5వేలు కట్టాల్సిందే!

"వంతుల ప్రకారం వారానికి ఒకరి పెట్టారు. మాకు జీతం ఏమి లేదు. కేవలం కస్టమర్స్​ ఇచ్చే వాటితోనే మేము జీవనం గడుపుతున్నాము. కస్టమర్స్​ ఇచ్చే డబ్బులతోనే కట్టెలు, డీజిల్​ లాంటివి తీసుకొస్తాం. ఆ డబ్బుల్లో ఎంతో కొంతో మిగిలితే అవి వాడుకుంటాం తప్ప ప్రభుత్వం నుంచి రూపాయి రాదు. నేను ఇక్కడ 25 సంవత్సరాల నుంచి పని చేస్తున్నా"-పంతం ఏడుకొండలు, కాటికాపరి

ఇవీ చదవండి:

Last Updated : Dec 23, 2022, 5:42 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.