ETV Bharat / state

దుబాయ్ నుంచి స్వగ్రామానికి చేరుకున్న వారానికి.. కరోనాతో మహిళ మృతి

author img

By

Published : Mar 13, 2021, 10:59 AM IST

దుబాయ్ నుంచి వచ్చిన మహిళ కరోనాతో మృతి చెందింది. ఈ ఘటన తూర్పు గోదావరి జిల్లా విశ్వేశ్వరాయపురంలో జరిగింది.

lady died with corona
కరోనాతో మహిళ మృతి

తూర్పు గోదావరి జిల్లా మలికిపురం మండలం విశ్వేశ్వరాయపురంలో శుక్రవారం కరోనాతో ఓ మహిళ(45) మృతి చెందింది. ఆ మహిళ వారం క్రితం దుబాయ్ నుంచి స్వగ్రామానికి చేరుకుంది. నాలుగు రోజుల నుంచి ఆమెకు జ్వరం తీవ్రంగా ఉంది. ఉదయం స్థానిక లక్కవరం పీహెచ్​సీలో కరోనా నిర్ధారణ పరీక్ష చేయించారు.

రిపోర్టులో పాజిటివ్​గా తేలింది. చికిత్స నిమిత్తం అమలాపురం కిమ్స్​కి తరలించగా.. అక్కడ పరిస్థితి విషమించడంతో సాయంత్రం కాకినాడ తరలిస్తుండగా మార్గంమధ్యలో మృతి చెందినట్లు లక్కవరం పీహెచ్​సీ వైద్యాధికారి దుర్గా ప్రసాద్ తెలిపారు.

తూర్పు గోదావరి జిల్లా మలికిపురం మండలం విశ్వేశ్వరాయపురంలో శుక్రవారం కరోనాతో ఓ మహిళ(45) మృతి చెందింది. ఆ మహిళ వారం క్రితం దుబాయ్ నుంచి స్వగ్రామానికి చేరుకుంది. నాలుగు రోజుల నుంచి ఆమెకు జ్వరం తీవ్రంగా ఉంది. ఉదయం స్థానిక లక్కవరం పీహెచ్​సీలో కరోనా నిర్ధారణ పరీక్ష చేయించారు.

రిపోర్టులో పాజిటివ్​గా తేలింది. చికిత్స నిమిత్తం అమలాపురం కిమ్స్​కి తరలించగా.. అక్కడ పరిస్థితి విషమించడంతో సాయంత్రం కాకినాడ తరలిస్తుండగా మార్గంమధ్యలో మృతి చెందినట్లు లక్కవరం పీహెచ్​సీ వైద్యాధికారి దుర్గా ప్రసాద్ తెలిపారు.

ఇదీ చదవండి:

అమలాపురంలో కొత్తగా 5 కరోనా కేసులు నమోదు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.