ETV Bharat / state

కరోనా భయం.. గుండెపోటుతో యువకుని మృతి.. గ్రామస్థుల ఆందోళన

author img

By

Published : Jul 19, 2020, 9:11 PM IST

తనకు కరోనా వచ్చిందేమోనన్న ఆందోళన తూర్పుగోదావరి జిల్లా రామవరంలో ఓ యువకుని ప్రాణాలు తీసింది. మరో ఇద్దరికీ కరోనా పాజిటివ్​గా రావడం వల్ల గ్రామస్థుల్లో ఆందోళన నెలకొంది. అధికారులు గ్రామంలో పర్యటించి అందరికీ పరీక్షలు నిర్వహించాలని గ్రామస్థులు కోరుతున్నారు.

కరోనా భయం.. గుండెపోటుతో యువకుని మృతి.. గ్రామస్థుల ఆందోళన
కరోనా భయం.. గుండెపోటుతో యువకుని మృతి.. గ్రామస్థుల ఆందోళన

తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం రామవరంలో శనివారం ఓ యువకుడు కరోనా వచ్చిందేమోనన్న భయంతో గుండెపోటుకు గురై ప్రాణాలు కోల్పోయాడు. గ్రామంలో మరో ఇద్దరికి కరోనా లక్షణాలు బయటపడడంతో పరీక్షలు చేయగా పాజిటివ్​గా తేలింది. ఈ క్రమంలో గ్రామస్థులు, వారితో సన్నిహితంగా ఉన్న యువకులు ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే ఈ ప్రాంతాన్ని అధికారులు రెడ్​జోన్​గా ప్రకటించారు. అధికారులు గ్రామంలో పర్యటించి అందరికీ పరీక్షలు నిర్వహించాలని.. యువకులకు కౌన్సిలింగ్​ ద్వారా ధైర్యం చెప్పాలని.. మండల తెలుగు యువత అధ్యక్షులు అడబాల వెంకటేశ్వర్లు అన్నారు.

ఇదీ చూడండి..

తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం రామవరంలో శనివారం ఓ యువకుడు కరోనా వచ్చిందేమోనన్న భయంతో గుండెపోటుకు గురై ప్రాణాలు కోల్పోయాడు. గ్రామంలో మరో ఇద్దరికి కరోనా లక్షణాలు బయటపడడంతో పరీక్షలు చేయగా పాజిటివ్​గా తేలింది. ఈ క్రమంలో గ్రామస్థులు, వారితో సన్నిహితంగా ఉన్న యువకులు ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే ఈ ప్రాంతాన్ని అధికారులు రెడ్​జోన్​గా ప్రకటించారు. అధికారులు గ్రామంలో పర్యటించి అందరికీ పరీక్షలు నిర్వహించాలని.. యువకులకు కౌన్సిలింగ్​ ద్వారా ధైర్యం చెప్పాలని.. మండల తెలుగు యువత అధ్యక్షులు అడబాల వెంకటేశ్వర్లు అన్నారు.

ఇదీ చూడండి..

కరోనా భయం: హాస్పిటల్​లో చేర్చుకోలేదు...భార్య కళ్లెదుటే భర్త మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.