ETV Bharat / state

'అసమర్థ పాలనకు జగన్ తీసుకుంటున్న నిర్ణయాలే నిదర్శనం' - సీఎం జగన్​పై జ్యోతుల నెహ్రూ కామెంట్స్

సీఎం జగన్​పై తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ తీవ్ర విమర్శలు చేశారు. జగన్ అసమర్థ పాలనకు ఆయన తీసుకొంటున్న నిర్ణయాలే కొలమానం అని నెహ్రూ వ్యాఖ్యానించారు.

'అసమర్థ పాలనకు జగన్ తీసుకుంటున్న నిర్ణయాలే నిదర్శనం'
'అసమర్థ పాలనకు జగన్ తీసుకుంటున్న నిర్ణయాలే నిదర్శనం'
author img

By

Published : Nov 8, 2020, 5:30 PM IST

మద్యం పాలసీలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందిందని తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ అన్నారు. చంద్రబాబు ఇసుక ఉచితంగా ఇస్తే ఆ పాలసీ లోపభూయిష్టం అంటూ హడావుడి చేసిన జగన్ నేటికీ సరైన ఇసుక పాలసీ అమలు చేయలేకపోయారని నెహ్రూ విమర్శించారు. అమరావతి విషయంలో మడమ తిప్పి మూడు రాజధానులు అంటూ ప్రాంతాల మధ్య వైషమ్యాలు తీసుకొచ్చారన్నారు. పోలవరం, ప్రత్యేక హోదా విషయంలో కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడంలో వైఫల్యం చెందారని నెహ్రూ పేర్కొన్నారు.

మద్యం పాలసీలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందిందని తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ అన్నారు. చంద్రబాబు ఇసుక ఉచితంగా ఇస్తే ఆ పాలసీ లోపభూయిష్టం అంటూ హడావుడి చేసిన జగన్ నేటికీ సరైన ఇసుక పాలసీ అమలు చేయలేకపోయారని నెహ్రూ విమర్శించారు. అమరావతి విషయంలో మడమ తిప్పి మూడు రాజధానులు అంటూ ప్రాంతాల మధ్య వైషమ్యాలు తీసుకొచ్చారన్నారు. పోలవరం, ప్రత్యేక హోదా విషయంలో కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడంలో వైఫల్యం చెందారని నెహ్రూ పేర్కొన్నారు.

ఇదీ చదవండి: కుటుంబం ఆత్మహత్య కేసు: నంద్యాలకు చేరుకున్న విచారణ కమిటీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.