ETV Bharat / state

ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు వ్యూహాలు.. రూ. 20 బాండ్​పై హామీలు

నాలుగో విడత పంచాయతీ ఎన్నికలు ఆదివారం జరుగనున్నాయి. అభ్యర్థులు ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. అందుకోసం ఒక్కొక్కరు ఒక్కో విధంగా వ్యూహాలు రచిస్తున్నారు. రావులపాలెం గ్రామంలో ఓ అభ్యర్థి బాండ్ పేపర్​పై ఐదు హామీలను ముద్రించాడు. తమ వర్గం వారిని గెలిపిస్తే వాటిని అమలు చేస్తానంటున్నాడు.

author img

By

Published : Feb 20, 2021, 9:28 PM IST

ass
ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు వ్యూహాలు.. రూ. 20 స్టాంప్ బాండ్​పై హామీలు

నాలుగో విడత పంచాయతీ ఎన్నికలు రేపు జరగనున్న నేపథ్యంలో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ఒక్కొక్కరూ ఒక్కో విధంగా వ్యూహాలు రచిస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం మండలం ఊబలంకలో ఏకంగా రూ.20 స్టాంప్‌ బాండ్‌పై హామీలను ప్రచురించి ఇచ్చారు. ఈ గ్రామం బీసీ మహిళకు రిజర్వ్‌ కావడంతో మేడిశెట్టి సురేఖ సర్పంచి అభ్యర్థిగా, ఏడు వార్డులకు ఏడుగురు అభ్యర్థులు ఓ వర్గంగా నిలబడి పోటీ చేస్తున్నారు. వీరిలో మూడో వార్డు తరఫున పోటీ చేస్తున్న పడాల రంగారెడ్డి అనే వ్యక్తి తమ వర్గాన్ని గెలిపిస్తే అయిదు హామీలను నెరవేరుస్తామని ప్రకటించారు.

సంవత్సర కాలం పాటు కేబుల్‌ ప్రసారాలు, రేషన్‌, మినలర్‌ వాటర్‌ , బీపీ షుగర్‌ పరీక్షలు , ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు పది మందికి ఒక్కొక్కరికి రూ.10వేలు చొప్పన ఇస్తామని హామీ ఇవ్వడంతో పాటు వీటిని రూ.20 బాండ్‌పై ముద్రించారు. నోటరీ చేయించి మరీ 14 బాండ్‌లను చేయించి 14 వార్డుల్లోని పెద్దలకు అందించారు.

నాలుగో విడత పంచాయతీ ఎన్నికలు రేపు జరగనున్న నేపథ్యంలో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ఒక్కొక్కరూ ఒక్కో విధంగా వ్యూహాలు రచిస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం మండలం ఊబలంకలో ఏకంగా రూ.20 స్టాంప్‌ బాండ్‌పై హామీలను ప్రచురించి ఇచ్చారు. ఈ గ్రామం బీసీ మహిళకు రిజర్వ్‌ కావడంతో మేడిశెట్టి సురేఖ సర్పంచి అభ్యర్థిగా, ఏడు వార్డులకు ఏడుగురు అభ్యర్థులు ఓ వర్గంగా నిలబడి పోటీ చేస్తున్నారు. వీరిలో మూడో వార్డు తరఫున పోటీ చేస్తున్న పడాల రంగారెడ్డి అనే వ్యక్తి తమ వర్గాన్ని గెలిపిస్తే అయిదు హామీలను నెరవేరుస్తామని ప్రకటించారు.

సంవత్సర కాలం పాటు కేబుల్‌ ప్రసారాలు, రేషన్‌, మినలర్‌ వాటర్‌ , బీపీ షుగర్‌ పరీక్షలు , ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు పది మందికి ఒక్కొక్కరికి రూ.10వేలు చొప్పన ఇస్తామని హామీ ఇవ్వడంతో పాటు వీటిని రూ.20 బాండ్‌పై ముద్రించారు. నోటరీ చేయించి మరీ 14 బాండ్‌లను చేయించి 14 వార్డుల్లోని పెద్దలకు అందించారు.

ఇదీ చదవండి: అమలాపురం డివిజన్​లో పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.